భారతదేశంలోని చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సహా 8 నగరాల్లో గత త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10% వరకు పెరిగాయని వెల్లడైంది. 2024 చివరి త్రైమాసికంలో భారతదేశంలోని ఈ ఎనిమిది నగరాల్లో ఇళ్ల ధరలు 10 శాతం వరకు పెరిగాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ (CREDAI) నివేదిక వెల్లడించింది. ఈ నగరాలన్నింటిలోనూ డిమాండ్ పెరగడమే దీనికి ప్రధాన కారణమని క్రెడాయ్ నివేదిక పేర్కొంది. 2021 నుండి వరుసగా 16వ త్రైమాసికంలో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు పెరుగుతుండడంతో హౌస్ మార్కెట్ సానుకూలంగానే ఉందని ఈ నివేదిక సూచిస్తుంది. ఢిల్లీ NCR ప్రాంతంలో ఇళ్ల ధరలలో అత్యధిక పెరుగుదల నమోదై 31 శాతం పెరిగింది. అదేవిధంగా బెంగళూరులో ఇళ్ల ధరలు 23 శాతం వరకు పెరిగాయని నివేదించింది.
అలాగే చదరపు అడుగుకు ధర రూ.12,238కి చేరుకున్నాయి. చెన్నైలో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.8,141కి చేరుకోగా, ఢిల్లీ-ఎన్సిఆర్లో 31 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.11,993కి చేరుకున్నాయి. హైదరాబాద్లో రేట్లు 2 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.11,351కు చేరుకున్నాయి. కోల్కతాలో ధరలు 1 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.7,971కు చేరుకున్నాయి. ఇక ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) ధరలు 3 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.20,725 కు చేరుకుంది.

పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు డిమాండ్ పెరగడం వల్లే ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఇక డిసెంబర్లో భారతదేశంలో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 5 శాతం తగ్గింది. దీని అర్థం గత రెండేళ్లలో మొదటిసారిగా భారతదేశంలో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 1 మిలియన్ కంటే తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసే ట్రెండ్ పెరిగిందని చెబుతున్నారు. అంతే కాదు, చాలా మంది గేటెడ్ కమ్యూనిటీలలో ఇళ్ళు కొనడానికి ఆసక్తి చూపుతున్నారని CREDAI హెడ్ చెబుతున్నారు. ప్రభుత్వం గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడానికి చర్యలు తీసుకుంటే ఇళ్ల అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆయన అంటున్నారు.
ఈ ఏడాది పొడవునా ఇళ్ళ అమ్మకాలు సానుకూలంగా ఉంటాయని కూడా ఆయన ఎత్తి చూపారు. ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో లగ్జరీ అపార్ట్మెంట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిందని ఆయన నివేదిస్తున్నారు. బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఇళ్ల విలువ గణనీయంగా పెరిగిందని, అక్కడ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని కూడా ఆయన అన్నారు. మరోపక్క ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగింది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతించాయి. కానీ గత సంవత్సరం నుండి వివిధ ఐటీ కంపెనీలు ఉద్యోగులు ఆఫీస్ రావడాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. దింతోఉద్యోగులు ఆఫీస్ కోసం నగరాలకు తిరిగి వస్తున్నందున, గృహాలకు డిమాండ్ అండ్ ధరలు పెరుగుతున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications