OYO Rooms: స్టే నౌ-పే లేటర్ ఫీచర్ పరిచయం చేసిన ఓయో.. పూర్తి వివరాలివే..
OYO Rooms: దేశంలోని ఆతిథ్య రంగంలో టెక్నాలజీని ప్రవేశపెట్టి విజయవంతంగా ముందుకెళ్తున్న స్టార్టప్ ఓయో. దేశంలోని చిన్న పట్టణాలకు సైతం చేరుకోవటంలో ఓయో విజయం సాధించింది.
ఈక్రమంలో కంపెనీ సరికొత్త సేవలను తన కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. భారతీయ ప్రయాణికులకు స్టే నౌ.. పే లేటర్(SNPL) సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సౌకర్యం ద్వారా వినియోగదారులకు రూ.5,000 వరకు క్రెడిట్ పరిమితి లభిస్తుంది. దీనిని వినియోగించుకున్న తర్వాత 15 రోజుల లోపు సెటిల్ చేయాల్సి ఉంటుంది.

ఓయో ఈ కొత్త క్రెడిట్ ఆధారిత చెల్లింపు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు Simplతో భాగస్వామ్యం కలిగి ఉంది. యూజర్లు ఈ సౌకర్యాన్ని ఓయో యాప్ హోమ్ స్క్రీన్ లో యాక్సిస్ చేయవచ్చు లేదా చెల్లింపు చేసేటప్పుడు Simpl ఎంచుకోవాలి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉండగా.. త్వరలో iOS వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
SNPL వన్-ట్యాప్ చెల్లింపు హోటల్ బుకింగ్లను సౌకర్యవంతంగా మారుస్తుందని డిజిటల్ లెండింగ్ కన్సల్టెంట్ పారిజాత్ గార్గ్ అభిప్రాయపడ్డారు. సింపల్ ద్వారా హోటల్ బుకింగ్ చేసే వినియోగదారులకు 65 శాతం వరకు తగ్గింపుతో పాటు రూ.50 క్యాష్బ్యాక్ లభించనుంది. ఇదే సమయంలో గడువు లోపు చెప్పింపు చేయటంలో విఫలమైతే బిల్లు మెుత్తాన్ని బట్టి రూ.250 వరకు వడ్డీ, ఆలస్య రుసుములతో పాటు జీఎస్టీ విధించబడుతుందని యూజర్లు గుర్తుంచుకోవాలి.
ఇలా పే లేటర్ సౌకర్యాలను వినియోగించుకునేటప్పుడు కస్టమర్లు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇవి రుణ ఉచ్చులు.. గడువు లోపు చెల్లింపు చేయకపోతే భారీ పెనాల్టీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. పైగా ఇది కస్టమర్ల క్రెడిట్ స్టోరుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం కూడా ఉంది. ఇది భవిష్యత్తులో ఏదైనా క్రెడిట్ పొందే అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుంది.


Click it and Unblock the Notifications