ఎయిరిండియా, విస్తారా విమాన సర్వీసులపై హాంగ్‌కాంగ్ నిషేధం

ఎయిరిండియా, విస్తారా విమానాలను హాంగ్‌కాంగ్ బ్యాన్ చేసింది. అక్టోబర్ 17వ తేదీ నుండి 30వతేదీ మధ్య నిషేధం కొనసాగనున్నట్లు తెలిపింది. భారత్ నుండి తమ దేశానికి వచ్చిన ప్రయాణీకుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో హాంగ్‌కాంగ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాపై హాంగ్ కాంగ్ నిషేధం విధించడం ఇది మూడోసారి. గతంలో ఆగస్ట్ 18వ తేదీ నుండి ఆగస్ట్ 31వ తేదీ మధ్య, సెప్టెంబర్ 20వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ మధ్య నిషేధం విధించింది. విస్తారా విమానాలను మొదటిసారి బ్యాన్ చేసింది.

జూలై నెలలో హాంగ్‌కాంగ్ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మేరకు ప్రయాణానికి 72 గంటల ముందు కరోనా పరీక్షల్లో కరోనా నెగిటివ్ నిర్ధారణ అయితే భారత్ నుండి హాంగ్‌కాంగ్ రావాలని పేర్కొంది. అంతేకాకుండా హాంగ్‌కాంగ్ విమానాశ్రయంలో పోస్ట్ ఫ్లైట్ కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలి.

Hong Kong Bans Air India & Vistara Flights From Oct 17 to 30

ఢిల్లీ-హాంగ్‌కాంగ్ ఎయిరిండియా విమానం, చెన్నై-హాంగ్‌కాంగ్ విస్తారా విమానంలో కొంతమంది ప్రయాణీకులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో హాంగ్‌కాంగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాంగ్‌కాంగ్‌లో ఇప్పటి వరకు 5,238 కరోనా కేసులు, 105 మరణాలు నమోదయ్యాయి. కరోనా ప్రభావిత జాబితాలో 128వ స్థానంలో ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+