బ్యాంకింగ్ రంగంలో ఇప్పటి వరకు ఎన్నెన్నో ఆఫర్లు, ప్యాకేజీలు చూశాం. అఫ్కోర్స్ వాటిలో చాలా వరకు కస్టమర్ల జేబులకు చిల్లులు పెట్టేవే అన్నది వేరే విషయం. పట్టణీకరణ పెరుగుతోన్న క్రమంలో వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లించే ఈఎంఐ విధానానికి ఆదరణ బాగా పెరిగింది. కస్టమర్ల అభిమానాన్ని కూడా చూరగొనే కొన్ని బ్యాంకులు మరో అడుగు ముందుకేసి వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తున్నాయి. ఈక్రమంలో..
సున్నా వడ్డీకే హోమ్లోన్ ఇస్తామంటూ ఒక బ్యాంకు సంచలన ఆఫర్ ప్రకటించింది. దాని పేరు నార్డియా బ్యాంక్. యూరప్ లోని డెన్మార్క్ కేంద్రంగా పనిచేస్తోన్న ఈ బ్యాంకు.. 20 ఏళ్లపాటు ఇంటి రుణాన్ని ఎలాంటి వడ్డీ లేకుండానే ఇచ్చేస్తానంటూ ప్రకటించిన ఆఫర్ ప్రస్తుతం ప్రపంచమంతటా చర్చనీయాంశమైంది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఇతర బ్యాంకులు కూడా నార్డియా బ్యాంక్ రూట్లోనే వెళ్తున్నాయి.

నిజానికి డెన్మార్క్ లో బ్యాంకుల తీరే వేరు. ఇతర దేశాల్లోలాగా కస్టమర్లను, అప్పులు తీసుకున్నవాళ్లను చచ్చే స్థితిని నెట్టేయడం అక్కడ ఉండదు. ప్రపంచంలో సున్నా కాదు కదా.. మైనస్లో వడ్డీ రేట్లు ఉన్న ఏకైక దేశం డెన్మార్కే. ప్రపంచంలో మరే దేశం ఇవ్వనంత కాలం ఇవే రేట్లను డెన్మార్క్ కొనసాగించింది. 2012లో తొలిసారి అక్కడి ప్రభుత్వం వడ్డీ రేట్లను సున్నా కంటే తక్కువకు తగ్గించినప్పుడు డెన్మార్క్లో సొంత ఇల్లు కొన్న వాళ్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది.
అసలు ఏమాత్రం వడ్డీ లేకుండా 20 ఏళ్లకు ఇంటిపై రుణం ఇవ్వడం అంటే నమ్మశక్యం కానిదే. ఇప్పుడు డెన్మార్క్లోని నార్డియా బ్యాంక్ ఏబీపీ సున్నా వడ్డీకే హోమ్లోన్ ఇస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచకుండా అలాగే ఉంచుతున్నాయి. 2021లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని బ్లూమ్బర్గ్ స్పష్టం చేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications