Soaps: శుభవార్త చెప్పిన హిందుస్థాన్ యూనిలీవర్.. సబ్బులు, డిటర్జెంట్ ధరలు తగ్గింపు!
దేశంలో ప్రముఖ FMCG కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలీవర్ సబ్బులు, డిటర్జెంట్ ధరలు తగ్గించింది. ప్రొడక్ట్ బట్టి 2 నుంచి 19 శాతం మేర ధరలు తగ్గించినట్లు వెల్లడించింది. గతంలో ముడిసరకు ధరలు పెరుగడంతో హెచ్యూఎల్ సహా ఇతర కంపెనీలు గత కొన్ని విడతల వారీగా ధరలను పెంచాయి. అయితే ముడిసరకు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
లైఫ్బాయ్
తగ్గిన ధరలు కలిగిన స్టాక్ ఈ నెలాఖరుకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. హెచ్యూఎల్ విక్రయించే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ 500 ఎంఎల్ ధర ప్రస్తుతం రూ.115 ఉండగా.. దాన్ని రూ.112కి తగ్గించింది. రిన్ డిటర్జెంట్ కేజీ పౌడర్ ధర రూ.103 నుంచి రూ.99కి చేరనుంది. లైఫ్బాయ్ 125 గ్రాముల 4 సోప్లు ఉండే ప్యాక్ ధర రూ.140 నుంచి రూ.132కి తగ్గించనుంది.
15 రోజుల తర్వాతే
50 గ్రాముల డవ్ సబ్బు ధర రూ.27 నుంచి రూ.22కి తగ్గనుంది. తగ్గించిన ధరల సమాచారం ఆ కంపెనీ ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు అందజేసింది. తగ్గించిన ధరలు కలిగిన ఉత్పత్తులు 15 రోజుల తర్వాతే మార్కెట్లోకి వస్తాయని తెలుస్తోంది.
గోద్రెజ్
మరో FMCG కంపెనీ అయిన గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ మొదటగా ఈ ధరలు తగ్గింపు నిర్ణయం తీసుకుంది. గత నెలలో ఆ కంపెనీ కొన్నింటికి ధరలు తగ్గించగా.. మరికొన్ని ఉత్పత్తుల పరిమాణం పెంచింది. రూ.10కు లభించే నం.1 సబ్బు బరువును 41 గ్రాముల నుంచి 50 గ్రాములకు పెంచిన సంగతి తెలిసిందే.