అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ రీసెర్చ్ సంస్థ Hindenburg Research ఇచ్చిన రిపోర్టు అదానీ గ్రూప్ కంపెనీని ఏం చేసిందో మనందరం గమనించాం. ఈ క్రమంలోనే తాము మరో సంచలన రిపోర్ట్ విడుదల చేయనున్నామంటూ మరోసారి ప్రకంపనలు సృష్టించింది.
ఈ క్రమంలో హిండెన్బర్గ్ సంస్థ తాజాగా అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కంపెనీని టార్గెట్ చేసుకుంది. Twitter మాజీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు అయిన జాక్ డోర్సేను టార్గెట్ చేసింది. డోర్సేకు చెందిన బ్లాక్ ఇంక్(Block Inc) కంపెనీ అసలైన కస్టమర్ల సంఖ్యను వాస్తవానికంటే ఎక్కువగా చూపిందని ఆరోపించింది. దీనికి తోడు కంపెనీ కస్టమర్లను పొందేందుకు చేసే వివిధ ఖర్చులను కావాలనే తక్కువగా చూపించిందంటూ బాంబు పేల్చింది.

ఈ వ్యవహారంపై తాము దాదాపు రెండు సంవత్సరాల పాటు పరిశోధన చేసిన తర్వాత తాజా రిపోర్టును బహిర్గతం చేస్తున్నట్లు హిండెన్బర్గ్ వెల్లడించింది. డెమోగ్రాఫిక్ సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో మోసానికి వినియోగించటం ద్వారా సంస్థలోని కొందరు వ్యక్తులు దాదాపు 1 బిలియన్ డాలర్లకు పైగా నగదును పొందారని ఆరోపించింది. ఈ ప్రకటనతో భారతదేశానికి చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ కంపెనీలపై ఆరోపణలు చేసిన రెండు నెలల తర్వాత హిండెన్ బర్గ్ తాజాగా మరో సారి వార్తల్లో హైలైట్ అయ్యింది.
హిండెన్ బర్గ్ రిపోర్ట్ వెలుగులోకి రాగానే బ్లాక్ ఇంక్ కంపెనీ షేర్లు దాదాపు 20 శాతం మేర క్షీణించాయి. నకిలీ ఖాతాలను కలిగి ఉన్న పేమెంట్ సంస్థ విలువ దాదాపు 44 బిలియన్ డాలర్లుగా ఉందని తెలుస్తోంది. దీనికి తోడు కరోనా మహమ్మారి సమయంలో కంపెనీ షేర్లు భారీగా పెరగిన తరుణంలో కంపెనీ సహవ్యవస్థాపకులు జాక్ డోర్సే, జేమ్స్ మెక్కెల్వేలు ఒక బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించి ప్రయోజనాన్ని పొందారని రిపోర్టు తేటతెల్లం చేసింది.
కంపెనీకి చెందిన CFO అమృతా అహుజా, క్యాష్ యాప్ లీడ్ మేనేజర్ బ్రియాన్ గ్రాసడోనియాతో సహా ఇతర ఎగ్జిక్యూటివ్లు కూడా మిలియన్ల కొద్ది డాలర్లను స్టాక్లో ఉంచినట్లు నివేదిక పేర్కొంది. బ్యాంక్ అకౌంట్లు లేని కస్టమర్లకు సేవలను అందించటం ద్వారా ఈ యాప్ ప్రాచుర్యం పొందింది.
ఈ క్యాష్ యాప్ తన ప్లాట్ఫారమ్ ద్వారా స్టాక్, బిట్కాయిన్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఈ సేవలను వినియోగించుకుని బ్యాంక్ ఖాతాలు లేని కస్టమర్లు నేరపూరిత లేదా అక్రమ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని నివేదిక ఆరోపించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications