ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం (మే 17) రంగాలకు ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఈ రోజు ఏడు రంగాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. - MGNREGA,హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, వ్యాపారాలు-కోవిడ్, డిక్రిమినలైజేషన్ ఆప్ కంపెనీస్ యాక్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, సంబంధిత అంశాలు, రాష్ట్రాలు-వనరులకు సంబంధించిన అంశాలు వివరించారు. తాము జీవనం-జీవనోపాధిపై దృష్టి సారించామన్నారు. వచ్చే మూడు నెలలు కూడా నిత్యావసరాలు అందిస్తామని ఇప్పటికే చెప్పామన్నారు. పేదలకు ఆహారం ప్రభుత్వం బాధ్యత అన్నారు.

సాంకేతిక విప్లవం దోహదం
సంక్షోభం వచ్చింది వాస్తవమేనని, ఇలాంటి సమయంలో అవకాశాలు వెతుక్కోవాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సంక్షోభంలో అవకాశాలు వెతకాలని సూచిస్తారన్నారు. సంక్షోభం విసిరిన సవాల్తో స్వయం సమృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. భూమి, శ్రమ, చట్టాలల్లో సంస్కరణలు చేపట్టామన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఆహార ధాన్యాలు, పప్పు దినుసుల ఇస్తున్నట్లు చెప్పారు.
జన్ ధన్ యోజన అకౌంట్లో నేరుగా డబ్బులు వేసినట్లు చెప్పారు. 20 కోట్ల ఖాతాల్లో రూ.10వేల కోట్లు వేసినట్లు చెప్పారు. 2.2 కోట్ల మంది భవనాల నిర్మాణాల కార్మికుల ఖాతాల్లో దాదాపు రూ.3,950వేల కోట్లు వేసినట్లు తెలిపారు. 12 లక్షల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు రూ.3.660 కోట్లు వెనక్కి తీసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. మూడు నెలల పాటు ఉజ్వల యోజన కింద ఉచితంగా సిలిండర్లు అందిస్తున్నామన్నారు. 6.81 కోట్ల మందికి సిలిండర్లు ఇచ్చామన్నారు. పేదల సంక్షేమానికి సాంకేతిక విప్లవం దోహదం చేసిందన్నారు.

శ్రామిక్ రైళ్లలో 85 శాతం కేంద్రం, 15 శాతం రాష్ట్రాలు
కరోనా నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండాలని ప్రధాని మోడీ మొదటి నుండి చెబుతున్నారని నిర్మల అన్నారు. వలస కార్మికులకు ఫుడ్, సౌకర్యాలు రాష్ట్రాలు, FCI అందించాయని, స్వచ్చంధ సంస్థలు కూడా సాయం చేశాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులను తరలించేందుకు శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శ్రామిక్ రైళ్ల కోసం కేంద్రం 85 శాతం, రాష్ట్రాలు 15 శాతం భరిస్తున్నాయన్నారు. శ్రామికులు ఉన్న ప్రాంతానికే రైళ్లు పంపించి సొంత ప్రాంతాలకు పంపిస్తున్నట్లు చెప్పారు. భూములు, శ్రామిక శక్తి, నగదు నిల్వలు, చట్టాలను అన్నింటిని దృష్టిలో పెట్టుకొని సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు. పేదలకు ఆహారం అందించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు.

రైతులకు, ఉపాధి హామీ కోసం...
వైద్య సదుపాయాల కోసం రూ.15 కోట్లు విడుదల చేసిందని, రాష్ట్రాలకు రూ.4,113 కోట్లు వితరణ చేసినట్లు చెప్పారు. 11 కోట్లకు పైగా హైడ్రోక్లోరోఫిన్ మాత్రలు రాష్ట్రాలకు అందించినట్లు చెప్పారు. రైతులకు రూ.3వేల కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. 8.19 కోట్ల మంది రైతులకు నేరుగా రూ.2వేలు ఇచ్చామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కోసం అదనంగా రూ.40వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇదివరకు బడ్జెట్లోనే రూ.61వేలు కేటాయించినట్లు చెప్పారు.
More From GoodReturns

Financial planning: మెడికల్ బిల్లుల భయం పోవాలంటే.. మీ పేరెంట్స్ కోసం ఇప్పుడే ఈ పనులు చేయండి!

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications