భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరులో ట్రాఫిక్ అంటే నరకమేనని చెప్పుకోవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్లితే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి ఎప్పుడు బయటకు వస్తామో తెలియని పరిస్థితి. ఉద్యోగులు అయితే సకాలంలో ఆఫీసుకు చేరుకోలేక బాస్ చేత రోజు తిట్లు తినడం అనేది నిత్యకృత్యం అవుతోంది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు ట్రాఫిక్ మీద ఓ వైద్యురాలి చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె బెంగుళూరు నగరంలోని రోడ్ల దుస్థితిపై చేసిన పోస్ట్ నెటిజన్లలో అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
Bengaluru కు చెందిన వైద్యురాలు డాక్టర్ నందిత అయ్యర్.. వర్తూర్ నుండి కేవలం 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు మూడు గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కొవాల్సి వచ్చిందని వాపోయారు. ఇదేం ట్రాఫిక్ అంటూ మండిపడ్డారు. ఈ పోస్ట్ అంతర్జాతీయంగా చర్చకు దారితీయడమే కాకుండా, నగర అభివృద్ధిపై పలు ప్రశ్నలకు వేదికగా మారింది.

ఆమె చేసిన పోస్ట్ ప్రకారం.. భారతదేశంలో అత్యధిక రోడ్డు పన్ను బెంగళూరులో ఉంది. అలాగే అత్యంత చెత్త రోడ్లు..దానిపై అత్యధిక బాధ కూడా ఇక్కడే ఉందని ఆమె తెలిపింది. . ఈ పోస్టు నెటిజన్లకు అభిప్రాయాల వేదికగా మారింది. పెద్ద గుంతలున్న రోడ్లు, అంతులేని ట్రాఫిక్ జామ్లు, ట్రాఫిక్ పోలీసుల గైర్హాజరు, ఒకే దారిలో తప్పుదారి డ్రైవింగ్ .. ఇది హృదయ విదారకం, నిరాశపరిచే పరిస్థితి అని ఆమె అన్నారు. దీనిపై అనేక మంది పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలలో నివసిస్తున్న వారు కూడా ఈ పోస్టు మీద తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మా నగరాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొన్నారు. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. పూణేలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మేము ఫ్యాన్సీ విమానాశ్రయాలు కట్టిస్తున్నాం కానీ నడవడానికి కూడా సురక్షితమైన రోడ్లు లేవని వాపోయారు.
మరొకరు నెటిజన్ ఈ రహదారి పరిస్థితులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ట్రాఫిక్లో గంటల తరబడి ఉండటమే ఒక మానసిక వ్యాధని బాధను వ్యక్తం చేశారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ఉద్దేశించి.. డాక్టర్ అయ్యర్ మాట్లాడుతూ చట్టాలను గౌరవించేవారికి ఎటువటి ప్రోత్సాహం లేదు. ఉల్లంఘించే వారికి ఎటువంటి శిక్ష లేదు. ప్రభుత్వం పౌరుల పట్ల బాధ్యత చూపించదు. మన పన్నులు జీవనోపాధికి కాకుండా రాజకీయ నాయకుల లాభాలకు దారి తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ నగరాల్లోని పౌర మౌలిక సదుపాయాల అసమర్థతపై పెద్ద చర్చను తెరపైకి తీసుకొచ్చింది. ప్రజల భద్రత, సమర్థవంతమైన ప్రయాణం, పన్నులకు సరిపడే మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నొక్కి చెప్పింది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో గ్యాస్ కష్టాలు.. హోటళ్లు మూతపడే ప్రమాదం?

Bengaluru: వారం రోజుల్లో బెంగళూరు పీజీల్లో గ్యాస్ ఖాళీ..! ప్రభుత్వం ఏం చేయబోతోంది?

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

బెంగళూరు ఆటో డ్రైవర్ల ఫోన్ వ్యసనంపై హాట్ డిబేట్.. సాప్ట్వేర్ ఇంజనీర్ ఆందోళనపై ఎవరేమన్నారంటే..

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్.. తిండి కోసం విలవిలలాడుతున్న ఫుడ్ ప్రేమికులు..

Bengaluru: స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఎంట్రప్రెన్యూర్ చెప్తున్న చేదు నిజాలు వినాల్సిందే!

ఫ్రిజ్లో పండ్లు దొంగిలించిన పని మనిషి.. వెంటనే యజమానిని అలర్ట్ చేసిన AI..ఆ తర్వాత ఏమైందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications