సూపర్ ఆఫర్: రూ.7,090 డిస్కౌంట్తో హీరో ఎలక్ట్రిక్ E-స్కూటర్, పేటీఎం ద్వారా రూ.10,500 ఆదా
హీరో ఎలక్ట్రిక్ భారత్లో తన ఎలక్ట్రిక్ ఫ్లాష్ స్కూటర్ ఫ్లాష్ను లాంచ్ చేసింది. ప్రారంభ ధర రూ.29,990 (ఎక్స్ షోరూమ్, పాన్ ఇండియా)గా ఉంటుంది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో దీని ధర రూ.32,710. కంపెనీకి చెందిన 615 టచ్ పాయింట్స్ వద్ద ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ పైన పరిమిత సమయానికి ప్రైస్ కట్ ఆఫర్ ఉంది.
HDFC గుడ్న్యూస్: ఈ నెంబర్కు ఫోన్ చేస్తే మీ ఇంటికి సేవలు
పేటీఎం ద్వారా కొంటే రూ.10,500 తగ్గుదల
హీరో ఎలక్ట్రిక్ స్కూటర్పై స్వల్పకాలం పాటు ఉండే ఆఫర్ కింద రూ.7,090 డిస్కౌంట్ను ఇస్తోంది. పేటీఎం ద్వారా కొనుగోలు చేస్తే రూ.10,500 వరకు ఆదా అవుతుంది. కంపెనీ తాజా నిర్ణయం ద్వారా ఫ్లాష్ మోడల్ స్కూటర్ రూ.29,990కి లభిస్తుంది.
50 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు
69 కిలోల బరువు కలిగిన ఈ-స్కూటర్లో మొబైల్ చార్జింగ్, రీజనరేటివ్ బ్రేకింగ్, ఎల్ఈడీ హెడ్ లైట్స్ వంటి కొత్త ఫీచర్స్ కలిగి ఉంది. 48వీ బ్యాటరీ కలిగి ఉన్న ఈ-స్కూటర్ను ఓసారి ఛార్జ్ చేస్తే 50 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీ పూర్తిగా రీఛార్జ్ కావడానికి 8 గంటల సమయం పడుతుంది.
ఆటో ఎక్స్పోలో కొత్త తరం వాహనాలు
హీరో ఎలక్ట్రిక్ రాబోవు ఆటో ఎక్స్పో 2020లో కొత్తతరం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తమ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉత్పత్తులు కొనసాగిస్తామని, తదుపరి కొత్త రకం వాహనాలను ప్రదర్శిస్తామని హీరో ఎలక్ట్రిక్ ఎండీ ఇదివరకు అన్నారు.