హెరిటేజ్ A2 మిల్క్: 90 రోజుల నిల్వ ఉండే ఈ పాల ధర రూ.50
జూన్ 1వ తేదీన అంతర్జాతీయ పాల దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ 'ఏ2 మిల్క్'ను ఆవిష్కరించింది. కంపెనీ వైస్ చైర్మన్, ఎండీ నారా భువవేశ్వరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి హైదరాబాద్లోని బంజారాహిల్స్ హెరిటేజ్ ఫ్రేష్ స్టోర్లో దీనిని ప్రారంభించారు.
హెరిటేజ్ ఫుడ్స్ నష్టం రూ.210 కోట్లు, నారా బ్రాహ్మణి ఏం చెప్పారంటే
రోగనిరోధక శక్తి కోసం..
ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఈ కొత్త పాలను హెరిటేజ్ ఫుడ్స్ విడుదల చేసినట్లు తెలిపారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించే వారికి ఈ పాలు చక్కటి ఎంపిక అని కంపెనీ పేర్కొంది. ఇందులో విటమిన్ డీ, కాల్షియమ్ అధికంగా ఉంటుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది.
90 రోజుల పాటు నిల్వ, ధర రూ.50
హెరిటేజ్ ఫుడ్స్ తీసుకు వచ్చిన 'ఏ2 మిల్క్' 90 రోజుల పాటు నిల్వ ఉంటాయని కంపెనీ తెలిపింది. 500ML ప్యాకెట్ ధర రూ.50గా నిర్ణయించారు. పాలలో కాల్షియం, విటమిన్ డీ వంటి పదార్థాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని నారా బ్రాహ్మణి ఈ సందర్భంగా చెప్పారు. మా కస్టమర్లు ఈ పాల ప్రయోజన అనుభూతి పొందుతారన్నారు.
ప్రముఖ రిటైల్ స్టోర్స్లలో
హెరిటేజ్ ఫుడ్స్ 'ఏ2 మిల్క్' ప్రముఖ రిటైల్ స్టోర్స్తో పాటు బిగ్ బాస్కెట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో కూడా లభిస్తాయి. ఎంపిక చేసిన స్టోర్స్, హెరిటేజ్ పార్లర్లలో అందుబాటులో ఉంటాయి.