బ్లాక్ డీల్ ద్వారా బంధన్ బ్యాంకులో 3శాతం వాటాను విక్రయించిన హెచ్డీఎఫ్సీ
బందన్ బ్యాంక్ లో 3 శాతం వాటాను ప్రముఖ హెచ్డీఎఫ్సీ ( హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ) విక్రయించినట్లు తెలుస్తోంది. ఇది బ్లాక్ డీల్ ద్వారా జరిగినట్లు బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. దాదాపు 5కోట్ల షేర్లు బ్లాక్ డీల్లో చేతులు మారినట్లు పేర్కొంది. దీంతో బందన్ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ వాటా తగ్గిపోయింది.
మోర్టగేజ్ రుణ సంస్థ అయిన హెచ్డీఎఫ్సీ లిమిటెడ్.. ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు లిమిటెడ్ విలీనం అవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆ సంస్థలు ప్రకటించాయి. దీనికి ఆర్బీఐ, సెబీ, సీసీఐ సహా ఇతర నియంత్రణా సంస్ధలు కూడా అనుమతులు ఇచ్చాయి. విలీన ప్రకటన తర్వాత బంధన్ బ్యాంకులో వాటాను విక్రయించాల్సి వచ్చిందని మార్గెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ డీల్ పై హెచ్డీఎఫ్సీ స్పందించాల్సి ఉంది.
హెచ్డీఎఫ్సీ నుంచి బంధన్ బ్యాంకులో ఉన్న వాటాను ఎవరు కొనుగోలు చేశారు. ఎవరికి విక్రయించిందనే దానిపై వివరాలు రావాల్సి ఉంది. డిసెంబర్ 31, 2021 నాటికి హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ బంధన్ బ్యాంకులో 9.89 శాతం వాటాతో 15.93 కోట్ల షేర్లను కలిగి ఉంది. తాజాగా దాంట్లో 3 శాతం వాటాను విక్రయించినట్లు సమాచారం. హెచ్డీఎఫ్సీ తన వాటాను విక్రయించడంతో బంధన్ బ్యాంక్ షేర్ ఎగబాకింది. బీఎస్సీ, నిప్టీలో 3.66 శాతం పెరిగి రూ. 327.20 ట్రేడ్ అయింది.