సెబి షాకింగ్: HDFCకి భారీ జరిమానా, షేర్లు పతనం
ముంబై: ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు షేర్లు నేడు భారీగా క్షీణించాయి. రెగ్యులేటర్ మధ్యంతర ఉత్తర్వులు ఉల్లంఘన రోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) రూ.1 కోటి జరిమానాను విధించింది. దీంతో శుక్రవారం HDFC బ్యాంకు షేర్లు నష్టపోయాయి. HDFC బ్యాంకు స్టాక్ 2.06 శాతం నష్టపోయి రూ.1,444.35 వద్ద క్లోజ్ అయింది. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్ప్ లిమిటెడ్ (HDFC) స్టాక్ 2.74 శాతం పతనమై రూ.2,590 వద్ద ముగిసింది.
సెబి పెనాల్టీ విధించడంతో ఈ స్టాక్స్ దెబ్బతిన్నాయి. సెబి చట్టంలోని సెక్షన్ 15హెచ్బీ ప్రకారం స్టాక్ బ్రోకింగ్ సంస్థ బీఆర్హెచ్ వెల్త్ క్రియేటర్స్ లిమిటెడ్ విషయంలో HDFC నిబంధనలు ఉల్లంఘించిందనేది సెబి ఆరోపణ.
2019 అక్టోబర్ 14వ తేదీన డబ్బులు చెల్లించాలని తాము జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పాటించనందుకు కోటి జరిమానా విధించినట్లు సెబి పేర్కొంది. అక్టోబర్ 14, 2019 నుండి ఇప్పటి వరకు వడ్డతో పాటు రూ.158.68 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.