వాహనాల లోన్ కేసులో HDFC బ్యాంకుకు రూ.10 కోట్ల జరిమానా
ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాకిచ్చింది. కారు లోన్ కేసులో ఈ దిగ్గజ బ్యాంకుకు ఆర్బీఐ రూ.10 కోట్ల జరిమానా విధించింది. ఒక విజిల్ బ్లోయర్ ఫిర్యాదు మేరకు, క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
రెగ్యులరేటరీ నిబంధనలను పాటించడంలో అవకతవకలు జరిగాయని ఈ పరిశీలనలో తేలినట్లుగా తెలుస్తోంది. కారు రుణాల పోర్ట్ఫోలియోలో HDFC బ్యాంకు నిబంధనలు పాటించలేదని ఆరోపణ. దీంతో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని 6(2), 8 సెక్షన్ల ప్రకారం HDFCపై ఈ పెనాల్టీ విధించినట్లు RBI తెలిపింది.
ఖాతాదారులకు థర్డ్ పార్టీ ఆర్థికేతర ఉత్పత్తుల మార్కెటింగ్, విక్రయానికి సంబంధించిన పత్రాలను పరిశీలించాక తనిఖీ చేశాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ షోకాజ్ నోటీసు జారీ చేసింది. HDFC బ్యాంకు వివరణ తర్వాత పెనాల్టీ విధించాలని నిర్ణయించింది.