దేశీయ ప్రయివేటు రంగ దిగ్గజం HDFC హైదరాబాద్ సహ దేశవ్యాప్తంగా 19 నగరాల్లో మొబైల్ ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చింది. కరోనా విజృంభణ, వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో పాక్షిక లాక్ డౌన్, ఇతర ఆంక్షల నేపథ్యంలో తమ ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వ్యాన్ల ద్వారా ఈ మొబైల్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు శనివారం HDFC బ్యాంకు తెలిపింది. ఈ మొబైల్ ఐటీఎంతో నగదు ఉపసంహరణ కోసం ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదు. ఈ బ్యాంకు కస్టమర్లకు స్థానికంగానే ఉపసంహరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

15 రకాల ట్రాన్సాక్షన్స్
మొబైల్ ఏటీఎంను ఉపయోగించి కస్టమర్లు 15 రకాల ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. ఆయా సమయాల్లో పరిమిత కాలం అందుబాటులో ఉంటుంది. ఒక మొబైల్ ఏటీఎం ఒకరోజులో ముూడు నుండి నాలుగు ప్రాంతాలను కవర్ చేస్తుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో డబ్బులు అవసరమైన వారికి లేదా ఇతర ఏటీఎం సంబంధ అవసరం ఉన్న వారికి మొబైల్ ఏటీఎం ఎంతో ప్రయోజనకరమని గ్రూప్ హెడ్ ఫర్ లయబిలిటీ ప్రోడక్ట్స్ ఎస్ సంపత్ కుమార్ తెలిపారు.

హైదరాబాద్ సహా ఈ నగరాల్లో..
కరోనా నిబంధనలను అనుగుణంగా ఈ ఏటీఎంలను నిర్వహిస్తున్నామని, కస్టమర్లను అనుమతిస్తున్నామని సంపత్ కుమార్ తెలిపారు. గత ఏడాది కూడా దేశవ్యాప్తంగా 50కి పైగా నగరాలలో బ్యాంకు ఈ మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. ఈసారి కూడా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పుణె, చెన్నై, అలహాబాద్, భువనేశ్వర్, కోయంబత్తూర్, డెహ్రాడూన్ తదితర సిటీల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

ప్రతిరోజు లక్షల కేసులు
ఇటీవల కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రతి రోజు లక్షల కేసులు నమోదవుతున్నాయి. వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలు లాక్ డౌన్, కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications