Q3 Results: ఈ వారం దేశీయ కార్పొరేట్ కంపెనీలు తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను వరుసగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో దిగ్గజ ఐటీ సేవల కంపెనీలు ఇప్పటికే తమ క్యూ3 ఫలితాల వెల్లడిని మెుదలుపెట్టాయి.
తాజాగా నోయిడా ఆధారిత టెక్ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ మూడవ త్రైమాసిక నికర లాభం 6.23 శాతం పెరిగి రూ.4,351 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,096 కోట్లుగా నమోదైంది. నోయిడాకు చెందిన ఐటీ కంపెనీ మొత్తం ఆదాయం గత ఏడాది ఇదే కాలంలో రూ.26,960 కోట్ల నుంచి ప్రస్తుతం రూ.28,816 కోట్లకు పెరిగింది.

శుక్రవారం మార్కెట్లు ముగిసిన తర్వాత ఫలితాలు ప్రకటించబడ్డాయి. అయితే ఇంట్రాడేలో షేరు ధర 3.85 శాతం లాభంతో రూ.1,543 వద్ద క్లోజ్ అయ్యింది. ఈ క్రమంలో కంపెనీ ఒక్కో షేరుపై రూ.12 మధ్యంతర డివిడెండ్ చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం రికార్డు తేదీగా జనవరి 20ని కంపెనీ నిర్ణయించింది. అలాగే అర్హులైన షేర్ హోల్డర్లకు సొమ్ము జనవరి 31న అందుతుంది. అలాగే కంపెనీ FY24 గైడెన్స్పై కంపెనీ తన ఆదాయ వృద్ధి ఏడాది ప్రాతిపధికన 5 నుంచి 5.5 శాతం మధ్య ఉండొచ్చని పేర్కొంది.
కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 19.8 శాతంగా నమోదైంది. త్రైమాసిక ప్రాతిపదికన ఇది 16 బేసిస్ పాయింట్లు మెరుగుపడింది. గత ఏడాది కంపెనీ పనితీరుపై సీఈవో విజయకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ 18 పెద్ద పెద్ద డీల్లను గెలుచుకున్నట్లు పేర్కొంది. వీటిలో ఆరు సర్వీస్ ప్రాజెక్టులు కాగా మిగిలిన 12 సాఫ్ట్వేర్ విభాగానికి చెందినవిగా కంపెనీ పేర్కొంది. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీలో మెుత్తం ఉద్యోగుల సంఖ్య 2,24,756 వద్ద నిలవగా.. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే అట్రిషన్ రేటు భారీగా క్షీణించి 12.8 శాతానికి చేరుకున్నట్లు వెల్లడైంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications