సాఫ్ట్వేర్ సేవల సంస్థ హెచ్సిఎల్టెక్ ఉద్యోగులను వారానికి మూడు రోజులు కార్యాలయానికి రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. ఒక వేళ ఆఫీస్ కు వెళ్లకుంటే ఫిబ్రవరి 19 నుంచి క్రమశిక్షణా చర్యలు తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా తన ఉద్యోగులను కార్యాలయాలకు రావాలని ఆదేశించింది. ఇప్పుడు ఈ జాబితాలో భారతదేశంలోని మూడవ అతిపెద్ద ఐటి కంపెనీ హెచ్సిఎల్టెక్ చేరింది.
వారానికి మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాలని ఆదేశించింది. "అందరు DFS (డిజిటల్ ఫౌండేషన్ సేవలు) ఉద్యోగులు, వారి బ్యాండ్ తో సంబంధం లేకుండా వారానికి కనీసం మూడు రోజులు వారు పని చేస్తున్న HCLTech కార్యాలయాలకు వెళ్లి పని చేయాల్సి ఉంటుంది" హెచ్సిఎల్టెక్ వికాస్ శర్మ, గ్లోబల్ హెడ్ - పీపుల్ ఫంక్షన్ DFS ఫిబ్రవరి 14 నాటి ఇమెయిల్లో చెప్పినట్లు
తెలుస్తోంది.

కంపెనీ హైబ్రిడ్ వర్క్ మోడల్ను అనుసరిస్తుందన్నారు. ఇందులో ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయాల్సి ఉంటుందని హెచ్సిఎల్టెక్ ప్రతినిధి తెలిపారు. "హెచ్ఆర్ సమావేశాలలో ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రిపోర్ట్ చేయకపోతే జీతం లేకుండా సెలవు ఇస్తామని మేనేజ్మెంట్ హెచ్చరిస్తోంది" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఉద్యోగి చెప్పారు.
ఉత్పాదకతను నిశితంగా పరిశీలిస్తున్నామని, కనీసం ఎనిమిది గంటల ల్యాప్టాప్ యాక్టివిటీని నిర్వహించాలని ఉద్యోగులను కోరినట్లు తెలుస్తోంది. హెచ్సిఎల్టెక్ సీనియర్ మేనేజర్లు, నాయకత్వ బృందం ఇప్పటికే హైబ్రిడ్ మోడ్కు మారిందని, వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి వస్తున్నారని మెయిల్ లో వివరించారు. " ఈ మెయిల్ పేర్కొన్న అంశాలు ఫిబ్రవరి 19, 2024 నుంచి అమలులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది.
డిసెంబర్ త్రైమాసికంలో, HCLTech నికర లాభంలో సంవత్సరానికి 6.23 శాతం (YoY) వృద్ధిని రూ. 4,351 కోట్లకు నమోదు చేసింది. ఇది టాప్-ఐదు భారతీయ IT కంపెనీలలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తోంది.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications