Hurun Philanthropy list: కార్పొరేట్ దిగ్గజాలుగా ఓ వైపు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తునే, దాతృత్వంతో తమ ఉదారతను చాటుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. వేలకోట్ల రూపాయలను విరాళాలుగా ఇస్తూ ఆపన్నులకు సాయం అందించే సహృదయులకు ఇండియాలో కొదువ లేదు. అంబానీ, అదానీలను వెనక్కు నెడుతూ మరో వ్యక్తి పరోపకారమే పరమావధిగా ముందుకు సాగుతున్నారు.
హురున్ ఇండియా దాతృత్వ జాబితా తాజాగా విడుదలైంది. ఇందులో ప్రముఖ IT కంపెనీ HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ అగ్రస్థానంలో నిలిచారు. ఏకంగా 2 వేల 42 కోట్లను విరాళంగా ఇచ్చారు. కాగా గత ఐదేళ్లలో ఆయన టాప్ ప్లేస్ లో నిలవడం ఇది మూడోసారి కావడం విశేషం.

విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ 1,774 కోట్ల విరాళాలతో ఈ జాబితాలో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ 376 కోట్లు దానం చేసి దేశంలో మూడవ అతిపెద్ద దాతగా నిలిచారు. కుమార్ మంగళం బిర్లా 287 కోట్లతో నాలుగు, గౌతమ్ అదానీ 285 కోట్ల డొనేషన్స్ తో ఐదు స్థానాల్లో నిలిచి సమాజానికి తమ వంతు సాయం అందిస్తున్నారు.
విరాళాల పరంగా బజాజ్ కుటుంబం, వేదాంత సారధి అనిల్ అగర్వాల్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ మరియు రోహిణి నీలేకని, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ మరియు అదార్ పూనావాలా టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక సంపద పరంగా చూస్తే ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్న బిలియనీర్ గా నిలిచారు. అనంతరం రెండో స్థానంలో గౌతమ్ అదానీ, మూడో ప్లేస్ లో శివ్ నాడార్ కొనసాగుతున్నారు.
హురున్ ఇండియా MS అనస్ రెహ్మాన్ జునైద్ మాట్లాడుతూ.. ఈ ఏడాది దాతృత్వంలో రికార్డు నెలకొన్నట్లు చెప్పారు. గత ఐదేళ్లలో 100 కోట్లకు పైగా విరాళాలు అందజేసే దాతల సంఖ్య 2 నుంచి 14కి పెరగిందని తెలిపారు. 50 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చే వారు 5 నుంచి 24కి పెరిగినట్లు వెల్లడించారు. 2022 ఆర్థిక సంవత్సరంలో టాప్ 10 దాతలు మొత్తం 3 వేల 34 కోట్లు విరాళాలు అందించగా.. 2023 నాటికి ఈ మొత్తం 5 వేల 806 కోట్లకు చేరినట్లు ప్రకటించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications