సంగారెడ్డిలో దేశంలోనే అతిపెద్ద హ్యాట్సన్ ప్లాంట్, 4,500 మందికి లబ్ధి
చెన్నైకి చెందిన పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హ్యాట్సన్ ఆగ్రో ప్రోడక్ట్స్ (HAP) తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద ఐస్క్రీమ్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతుంది. అక్టోబర్ 2020 నాటికి ఈ కంపెనీ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని చూస్తోంది. భారతదేశంలోనే అతిపెద్ద ప్లాంట్ను ఇక్కడ నిర్మించనుంది.
ఎక్కువ పాన్కార్డులుంటే రూ.10,000 జరిమానా, ఫైన్ తప్పించుకునేందుకు ఇలా చేయాలి?
500 మందికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
సంగారెడ్డి జిల్లాలోని గోవింద్పూర్లో రూ.207 కోట్ల పెట్టుబడితో హ్యాట్సన్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ద్వారా 250 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ డెయిరీ ఉత్పత్తుల ప్లాంట్ ద్వారా చుట్టుపక్కల 4,000 మంది పాడి రైతులకు ప్రయోజనం చేకూరనుందని హ్యాట్సన్ తన ప్రకటనలో తెలిపింది.
ఉత్పత్తి.. మార్కెటింగ్
హ్యాట్సన్ ఆగ్రో ప్రోడక్ట్స్ కుకింగ్, కన్సంప్షన్ ప్రోడక్ట్స్ను తయారు చేసి, మార్కెట్ చేస్తోంది. పాలు, పెరుగు, ఐస్ క్రీమ్స్, డెయిరీ వైట్నర్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, ఘీ, పన్నీరు వంటి వాటిని తయారు చేస్తోంది. ప్లాంట్ పనులు వేగంగా సాగుతున్నాయని, అక్టోబర్ నాటికి ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపింది.
విదేశాలకు ఎగుమతి
హ్యాట్సన్ కంపెనీ అరుణ్ ఐస్క్రీమ్, ఆరోక్య మిల్క్, ఐబాకో ఐస్క్రీమ్స్, ఓయాలో, అనీవా, సంటోసా బ్రాండ్లతో పాలు, పెరుగు, ఐస్క్రీమ్స్, నెయ్యి, పన్నీర్ వంటి అన్ని రకాల పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కార్యకలాపాల్లో ఉంది. వీటిని భారత్తో విక్రయించడంతో పాటు అమెరికా, మధ్యప్రాచ్యం వంటి 38 దేశాలకు ఎగుమతి చేస్తోంది.