రూ.1 కాయిన్ తయాకి ఎంత ఖర్చువుతుందో సగం దేశానికి తెలియదు, తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఒకప్పుడు రూపాయి కాకుండా మార్కెట్లో 50 పైసలు, 25 పైసలు కూడా చలామణిలో ఉండేవి. ఇలా చెప్పుకుంటే 25 పైసల కంటే తక్కువ విలువ ఉన్న నాణాలు కూడా అప్పట్లో చలామణి అయ్యాయి. కాలం మారుతున్న కొద్దీ ఈ నాణాల తయారీ లేకుండా చలామణి నుండి కనుమరుగైయ్యాయి. అయితే మనిషి జీవితంలో ఒక రూపాయికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తొంభైతొమ్మిది రూపాయలు సంపాదించిన కూడా ఒక వ్యక్తి దగ్గర 1 రూపాయి తక్కువ ఉన్న దానిని 100 రూపాయాలు అనలేరు. అందుకే మనిషికి ఒక రూపాయి నాణెం చాలా ముఖ్యమైనది. అయితే ఒక రూపాయి నాణెం ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.. ? అసలు ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు చేస్తుందో భారతదేశంలోని సగం మందికి తెలియదు.

ఒక రూపాయి నాణెం ఎలా, ఎక్కడ తయారు చేస్తారు?
సమాచార హక్కు (ఆర్‌టిఐ) ద్వారా కోరిన సమాచారంలో, ఆర్‌బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) 2018 సంవత్సరంలో ఒక రూపాయి నాణెం స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడుతుందని తెలిపింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ నాణేన్ని ప్రభుత్వ మింట్‌లో తయారు చేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన ఒక రూపాయి నాణెం వ్యాసం(diameter) దాదాపు 21.93millimeters. దీని మందం 1.45 millimeters, బరువు 3.76 గ్రాములు. ఈ ఒక్క రూపాయి నాణేలన్నీ ముంబయి ఇంకా హైదరాబాద్‌లలో ఉన్న భారత ప్రభుత్వ మింట్లో తయారు చేస్తారు.

Half of India does not know how much it takes to make a Rs 1 coin if it knows it will open a mint

ఒక రూపాయి నాణెం ముద్రించడానికి ఎంత ఖర్చవుతుంది ?
RBI కూడా ఒక రూపాయి నాణెం తయారీ ధర దాని ధర కంటే చాలా ఎక్కువ అని తేలిపింది. ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి ప్రభుత్వానికి రూ.1.11 ఖర్చవుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అదేవిధంగా రెండు రూపాయల నాణెం తయారీకి రూ.1.28, ఐదు రూపాయల నాణెం తయారీకి రూ.3.69, రూ.10 నాణెం తయారీకి రూ.5.54 ఖర్చవుతుంది.

ఒక రూపాయి నాణెం, నోటును ఎవరు తయారు చేస్తారు?
ప్రభుత్వం అన్ని రకాల నాణేలను, నోట్లను ముద్రిస్తుంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 10 నుండి రూ. 500 వరకు నోట్లను ముద్రిస్తుంది. 20 సెప్టెంబరు 2023కి ముందు RBI కూడా రూ. 2000 నోటును ముద్రించేది, కానీ ఇప్పుడు అది చెలామణి నుండి తీసివేసారు. 19న మే 2023 రూ.2000 నోటును చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అలాగే 30 సెప్టెంబర్ 2024 వరకు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగింది.

నోట్ల ముద్రణకు ఎంత ఖర్చవుతుంది?
RBI కూడా 2000 రూపాయల నోటును ముద్రించడానికి దాదాపు 4 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపింది. అయితే, ఈ ఖర్చు కొంత తక్కువగా కూడా ఉండవచ్చు. దీంతో పాటు వెయ్యి రూ.10 నోట్ల ముద్రణకు రూ.960, వెయ్యి రూ.100 నోట్ల ముద్రణకు రూ.1770, వెయ్యి రూ.200ల నోట్ల ముద్రణకు రూ.2370, వెయ్యి రూ.500 నోట్ల ముద్రణకు రూ.229 ఖర్చవుతుందని తేలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+