అమెరికా బయట నుంచి నియమించబడే కొత్త H-1B కార్మికులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజు.. అమెరికా ఐటీ అవుట్సోర్సింగ్, సిబ్బంది నియామక పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల ఉపాధిపై ఇప్పటివరకు విధించిన అతిపెద్ద ఆర్థిక అడ్డంకిగా ఈ నిర్ణయాన్ని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ ఐటీ కంపెనీలకు ఈ విధానం పెద్ద దెబ్బగా మారే అవకాశముందని చెబుతున్నారు.
బ్లూమ్బెర్గ్ న్యూస్ చేసిన విశ్లేషణ ప్రకారం.. H-1B వీసాల కోసం మధ్యవర్తులుగా వ్యవహరించే బహుళజాతి ఐటీ సంస్థలపై ఈ ఫీజు ప్రభావం ఎక్కువగా పడనుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు అమెరికా క్లయింట్ల కోసం పెద్ద సంఖ్యలో విదేశీ నిపుణులను నియమించుకుంటున్నాయి. మే 2020 నుంచి మే 2024 మధ్య ఈ మూడు కంపెనీలలో దాదాపు 90 శాతం కొత్త H-1B నియామకాలు అమెరికా కాన్సులేట్లలో ఆమోదం పొందాయి. ఆ సమయంలోనే ఈ ఫీజు అమల్లో ఉండి ఉంటే.. ఒక్కో కంపెనీకి వందల మిలియన్ల డాలర్ల అదనపు ఖర్చు చేయాల్సి వచ్చేది.

ఇన్ఫోసిస్ విషయంలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ నాలుగేళ్ల కాలంలో ఇన్ఫోసిస్ నియమించిన కొత్త H-1B ఉద్యోగుల్లో 93 శాతం కంటే ఎక్కువ మంది, అంటే 10,400 మందికి పైగా కార్మికులు, లక్ష డాలర్ల ఫీజుకు లోబడి ఉండేవారు. దీంతో వీసా ఖర్చులు బిలియన్ డాలర్లకు మించి పెరిగేవని బ్లూమ్బెర్గ్ అంచనా వేసింది. అదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో 6,500 మందికి పైగా ఉద్యోగులు, కాగ్నిజెంట్లో 5,600 మందికి పైగా ఉద్యోగులు ఈ భారాన్ని భరించాల్సి వచ్చేది.
బ్లూమ్బెర్గ్ విశ్లేషణ ప్రకారం:
ఇన్ఫోసిస్ నియమించిన కొత్త H-1B ఉద్యోగుల్లో 93శాతానికి పైగా (10,400 మందికి మించిన వారు) ఈ ఫీజుకు లోబడేవారు. దీంతో వీసా ఖర్చులు $1 బిలియన్ డాలర్లకు మించి పెరిగేవి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో 6,500 మందికి పైగా ఉద్యోగులు (82శాతం) ఈ ఫీజు చెల్లించాల్సి వచ్చేది.
కాగ్నిజెంట్లో 5,600 మందికి పైగా ఉద్యోగులు (89శాతం) ఈ భారాన్ని భరించాల్సి ఉండేది.
చట్టపరమైన సవాళ్ల కారణంగా ఈ ఫీజు అమలు తాత్కాలికంగా నిలిచిపోయినా.. పరిశ్రమలో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ఇమ్మిగ్రేషన్ న్యాయవాది జోనాథన్ వాస్డెన్ మాట్లాడుతూ.. కంపెనీలు విదేశాల్లో నియామకాలను పెంచడం ప్రారంభించాయని, దీని వల్ల అత్యుత్తమ ప్రతిభ కలిగినవారు కూడా అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
H-1B ప్రోగ్రామ్ అమెరికాలో కెరీర్ కోరుకునే విదేశీ గ్రాడ్యుయేట్లకు కీలక మార్గం. ప్రతి ఏడాది అందుబాటులో ఉన్న 85 వేల వీసా స్లాట్లలో ఎక్కువ భాగాన్ని పెద్ద టెక్, ఐటీ సంస్థలే దక్కించుకుంటున్నాయి. అయితే, ఈ ప్రోగ్రామ్ను అమెరికన్ కార్మికులకు చౌక ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారని రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల నేతలు ఇద్దరూ విమర్శలు చేస్తున్నారు.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాలో కొత్త నియామకాలు తగ్గి, భారత్ వంటి దేశాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఐటీ సంస్థలు కొత్త H-1B నియామకాలను తగ్గించాయి. న్యాయపరమైన విచారణలు కొనసాగుతున్నప్పటికీ, వచ్చే ఏడాది H-1B లాటరీలో దరఖాస్తులు 30 నుంచి 50 శాతం వరకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఈ విధానం అమెరికా వీసా వ్యవస్థలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రతిభ రంగంలోనూ కీలక మార్పులకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications