అమెరికా రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. వలసలపై మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ముఖ్యంగా హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని కట్టడి చేయడం లేదా దశలవారీగా తగ్గించే దిశగా ట్రంప్ పరిపాలన అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మొదటిగా హెచ్-1బీ వీసాలపై అమెరికన్ కంపెనీలు ఏటా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. ఇప్పటికే ఉన్న హెచ్-1బీ వీసాదారులకు ఇది వర్తించదని, కొత్తగా హెచ్-1బీ వీసాలు పొందే అభ్యర్థులకు మాత్రమే ఈ ఫీజు అమలులోకి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
అయితే ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా తనిఖీలను మరింత కఠినతరం చేస్తూ, భారత్లో జరిగే హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలను ఆలస్యం చేయించారు. తొలుత అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ చేయగా, అనంతరం అన్ని హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలను రెండు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. దీనితో ఇప్పటికే వీసా అపాయింట్మెంట్ల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులకు ఇది పెద్ద షాక్గా మారింది.

ఇదే సమయంలో కొంతమంది అభ్యర్థుల ప్రస్తుత హెచ్-1బీ వీసాలను కూడా తాత్కాలికంగా రద్దు చేసే నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభమైంది. ఫలితంగా, వీసా ఇంటర్వ్యూల కోసం భారత్కు వచ్చి అపాయింట్మెంట్లు రద్దవడంతో ఇక్కడే చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితి రోజురోజుకీ ఆందోళనకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే భారత్లో చిక్కుకున్న హెచ్-1బీ వీసాదారులే.. అమెరికా నుంచి రానున్న తమ సాటి భారతీయులను వచ్చే రెండు నెలల పాటు వీసా ఇంటర్వ్యూల కోసం అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్-1బీ వీసాదారులకు కీలక సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా, ఈ దశలో తమ ఉద్యోగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పోకుండా కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని వారు సూచిస్తున్నారు. వీసా అపాయింట్మెంట్లు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో.. సాధ్యమైనంతవరకు యజమానితో మాట్లాడి వర్క్ ఫ్రమ్ హోం (ఇంటి నుంచే పని) అనుమతి తీసుకోవాలని, లేకపోతే ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
సోషల్ మీడియా పరిశీలనను కఠినతరం చేయడంతో అమెరికా వీసా నియామకాలు కనీసం ఆరు నెలల వరకు ఆలస్యం అవుతున్నాయని, ఈ పరిస్థితుల్లో భారతదేశంలోనే చిక్కుకున్న H-1B వీసాదారులు ముందుగా తమ ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఎమిలీ న్యూమాన్ సూచించారు.ఒక H-1B వీసాదారు తన ఉద్యోగాన్ని కోల్పోతే, అమెరికాలో మరో ఉద్యోగం పొందడం అత్యంత క్లిష్టమవుతుందని తెలిపారు.
ఇమ్మిగ్రేషన్ న్యాయవాది రాహుల్ రెడ్డి కూడా ఈ పరిణామాలపై స్పందిస్తూ, సోషల్ మీడియా పరిశీలన అనేది అభ్యర్థులను అడ్డుకోవడానికి ఒక సాకుగా ఉపయోగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలన వలసేతర వీసా కార్యక్రమాల్లో మార్పులు చేయాలంటే అవి కాంగ్రెస్ ద్వారా వెళ్లాల్సి ఉంటుందని, అందుకు చాలా సమయం పడుతుందని ఆయన తెలిపారు. అయితే, వీసా హోల్డర్ అమెరికా వెలుపల ఉన్నప్పుడు, సరిహద్దు వద్ద ట్రంప్ పరిపాలనకు మరింత అధికారం ఉంటుందని, ఎవరినైనా దేశంలోకి ప్రవేశించకుండా ఆపే శక్తి ఉందని చెప్పారు.
ఇమ్మిగ్రేషన్ నిపుణుల ప్రకారం.. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఒకవేళ హెచ్-1బీ ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత జూన్ లేదా జూలైలో కొత్త ఉద్యోగం దొరికినా, ఆ కంపెనీ కొత్తగా హెచ్-1బీ పిటిషన్ వేయాల్సి వస్తుంది. అప్పుడు అమెరికన్ కంపెనీలు ఏడాదికి లక్ష డాలర్ల వీసా ఫీజు చెల్లించాల్సి వస్తుందని.. ఈ భారీ భారం మోయడానికి చాలా సంస్థలు సిద్ధంగా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఉద్యోగం పోయినవారు కొత్త అవకాశాలు దొరకకుండా పూర్తిగా ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్-1బీ వీసాదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని Immigration నిపుణులు సూచిస్తున్నారు. వీసా పొడిగింపు లేదా స్టాంపింగ్ కోసం ఈ సమయంలో భారత్కు ప్రయాణించవద్దని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేసుకోవడం ఉత్తమమని వారు స్పష్టం చేస్తున్నారు. ట్రంప్ పరిపాలన తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు, వేలాది మంది భారతీయ హెచ్-1బీ వీసాదారుల ఉద్యోగ భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టుతున్నాయని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications