కొత్త ఆర్థిక సంవత్సరం(financial year) ఏప్రిల్ 1 నుండి అంటే రేపటి నుండి ప్రారంభమవుతుంది. అలాగే రేపటి నుంచి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి, ఇందులో వస్తువులు అండ్ సేవల పన్ను (GST) రూల్స్ మార్పులు కూడా ఉన్నాయి. GST ప్రక్రియను సులభంగా చేయడానికి ఇంకా మోసాలను నిరోధించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. దీని కింద, ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే GST రూల్స్ మార్పులు చేసింది.

మల్టి-ఫ్యాక్టర్ అతేంటికేషన్ : ఈ రూల్స్ మార్పులలో భాగంగా GST పోర్టల్లోకి లాగిన్ అవ్వడానికి మల్టి-ఫాక్టర్ అతేంటికేషన్ తప్పనిసరి చేశారు. CNBC TV18 రిపోర్ట్ ప్రకారం, కేవలం పాస్వర్డ్తో లాగిన్ అవ్వడం ఇకపై కుదరదు. ట్యాక్స్ పేయర్స్ కూడా OTP లేదా ఇతర సెక్యూరిటీ టిప్స్ అనుసరించాల్సి ఉంటుంది. అంతే కాకుండా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ఇ-వే బిల్లు అండ్ ఇ-ఇన్వాయిస్ సిస్టం ఇంతకుముందు కంటే మరింత సేఫ్ చేసింది. సరైన అనుమతి లేకుండా ఇన్వాయిస్ జనరేట్ చేయలేరు. దీనివల్ల మోసాలకి ఆస్కారం ఉండదని నమ్ముతారు.
కొత్త మార్పుల ప్రకారం, ఇ-వే బిల్లు ఇప్పుడు 180 రోజులు మాత్రమే వాలిడిటీ అవుతుంది ఇంకా దీనికి 360 రోజుల కంటే ఎక్కువ ఎక్స్టెన్షన్ లభించదు. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు GSTR-7 (TDS సంబంధిత రిటర్న్)ను తరువాత తేదీలో దాఖలు చేయలేరు. ట్యాక్స్ పేయర్లు ప్రతినెల రిటర్న్ ఎప్పటికప్పుడు ఫైల్ చేయడం అవసరం. కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు కంపెనీ ప్రమోటర్లు అండ్ డైరెక్టర్లు GST ఫెసిలిటేషన్ సెంటర్కు వెళ్లి ఫింగర్ ప్రింట్/బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అలాగే, ఒక కంపెనీ పాన్ పై మల్టి GST రిజిస్ట్రేషన్ ఉంటే, అప్పుడు ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ISD)గా రిజిస్ట్రేషన్ కూడా అవసరం.
తప్పు చేస్తే 10 వేల జరిమానా: ఏప్రిల్ 1 నుండి తప్పుడు ఐటీసీ డిస్ట్రిబ్యూషన్ పై రూ.10 వేల జరిమానా విధించవచ్చు. ఈ మార్పులు భద్రతను పెంచుతాయని, అయితే పన్నులు దాఖలు చేయడం కొంచెం కష్టంగా మారవచ్చని నంగియా ఆండర్సన్ LLPకి చెందిన శివకుమార్ రామ్జీ చెప్పినట్లు నివేదిక పేర్కొంది. అలాగే AKM గ్లోబల్ సందీప్ సెహగల్ ప్రకారం, GST రూల్స్ ఇప్పుడు మరింత కఠినంగా మారబోతున్నాయి. పాత ఇన్వాయిస్లకు ఎటువంటి మినహాయింపు ఉండదు ఇంకా రూల్స్ పాటించకపోతే త్వరగా చర్యలు తీసుకుంటారు. పన్ను ప్రక్రియ సింపుల్ అలాగే ట్రాన్సపరెంట్ ఉండాలని, మోసాలను అరికట్టాలని ప్రభుత్వం కోరుకుంటుందని దీని ద్వారా స్పష్టంగా అవుతుందని తెలిపారు.
జిఎస్టికి సంబంధించి కఠినత్వం, పర్యవేక్షణ పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. చిన్న వ్యాపారవేత్తల నుండి పెద్ద వ్యాపారవేత్తల వరకు, ప్రతి ఒక్కరూ సిస్టం అప్ డేట్ చేయడం, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం అలాగే సరైన డాకుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయితే, కొత్త మార్పులతో వ్యాపారుల ట్యాక్స్ ఫైలింగ్ అనుభవం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications