కొత్త ఆర్థిక సంవత్సరం(financial year) ఏప్రిల్ 1 నుండి అంటే రేపటి నుండి ప్రారంభమవుతుంది. అలాగే రేపటి నుంచి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి, ఇందులో వస్తువులు అండ్ సేవల పన్ను (GST) రూల్స్ మార్పులు కూడా ఉన్నాయి. GST ప్రక్రియను సులభంగా చేయడానికి ఇంకా మోసాలను నిరోధించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. దీని కింద, ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే GST రూల్స్ మార్పులు చేసింది.

మల్టి-ఫ్యాక్టర్ అతేంటికేషన్ : ఈ రూల్స్ మార్పులలో భాగంగా GST పోర్టల్లోకి లాగిన్ అవ్వడానికి మల్టి-ఫాక్టర్ అతేంటికేషన్ తప్పనిసరి చేశారు. CNBC TV18 రిపోర్ట్ ప్రకారం, కేవలం పాస్వర్డ్తో లాగిన్ అవ్వడం ఇకపై కుదరదు. ట్యాక్స్ పేయర్స్ కూడా OTP లేదా ఇతర సెక్యూరిటీ టిప్స్ అనుసరించాల్సి ఉంటుంది. అంతే కాకుండా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ఇ-వే బిల్లు అండ్ ఇ-ఇన్వాయిస్ సిస్టం ఇంతకుముందు కంటే మరింత సేఫ్ చేసింది. సరైన అనుమతి లేకుండా ఇన్వాయిస్ జనరేట్ చేయలేరు. దీనివల్ల మోసాలకి ఆస్కారం ఉండదని నమ్ముతారు.
కొత్త మార్పుల ప్రకారం, ఇ-వే బిల్లు ఇప్పుడు 180 రోజులు మాత్రమే వాలిడిటీ అవుతుంది ఇంకా దీనికి 360 రోజుల కంటే ఎక్కువ ఎక్స్టెన్షన్ లభించదు. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు GSTR-7 (TDS సంబంధిత రిటర్న్)ను తరువాత తేదీలో దాఖలు చేయలేరు. ట్యాక్స్ పేయర్లు ప్రతినెల రిటర్న్ ఎప్పటికప్పుడు ఫైల్ చేయడం అవసరం. కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు కంపెనీ ప్రమోటర్లు అండ్ డైరెక్టర్లు GST ఫెసిలిటేషన్ సెంటర్కు వెళ్లి ఫింగర్ ప్రింట్/బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అలాగే, ఒక కంపెనీ పాన్ పై మల్టి GST రిజిస్ట్రేషన్ ఉంటే, అప్పుడు ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ISD)గా రిజిస్ట్రేషన్ కూడా అవసరం.
తప్పు చేస్తే 10 వేల జరిమానా: ఏప్రిల్ 1 నుండి తప్పుడు ఐటీసీ డిస్ట్రిబ్యూషన్ పై రూ.10 వేల జరిమానా విధించవచ్చు. ఈ మార్పులు భద్రతను పెంచుతాయని, అయితే పన్నులు దాఖలు చేయడం కొంచెం కష్టంగా మారవచ్చని నంగియా ఆండర్సన్ LLPకి చెందిన శివకుమార్ రామ్జీ చెప్పినట్లు నివేదిక పేర్కొంది. అలాగే AKM గ్లోబల్ సందీప్ సెహగల్ ప్రకారం, GST రూల్స్ ఇప్పుడు మరింత కఠినంగా మారబోతున్నాయి. పాత ఇన్వాయిస్లకు ఎటువంటి మినహాయింపు ఉండదు ఇంకా రూల్స్ పాటించకపోతే త్వరగా చర్యలు తీసుకుంటారు. పన్ను ప్రక్రియ సింపుల్ అలాగే ట్రాన్సపరెంట్ ఉండాలని, మోసాలను అరికట్టాలని ప్రభుత్వం కోరుకుంటుందని దీని ద్వారా స్పష్టంగా అవుతుందని తెలిపారు.
జిఎస్టికి సంబంధించి కఠినత్వం, పర్యవేక్షణ పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. చిన్న వ్యాపారవేత్తల నుండి పెద్ద వ్యాపారవేత్తల వరకు, ప్రతి ఒక్కరూ సిస్టం అప్ డేట్ చేయడం, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం అలాగే సరైన డాకుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయితే, కొత్త మార్పులతో వ్యాపారుల ట్యాక్స్ ఫైలింగ్ అనుభవం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications