ప్రస్తుతం దేశవ్యాప్తంగా జీవన ఖర్చులు పెరుగుతున్న వేళ, రోజువారీ వినియోగ వస్తువులు జీఎస్టీ ధరల తగ్గింపు సామాన్యులకు ఒక ఊరటగా మారనుంది. ముఖ్యంగా, రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులపై 12% నుండి 5%కి జీఎస్టీ తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇది త్వరలో GST కౌన్సిల్ సమావేశంలో పరిగణనలోకి రానుంది. ఈ జాబితా ప్రాథమిక స్థాయిలో రూపొందించబడినదే కానీ ఇది ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. తుది నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్ సమీక్ష అనంతరం వెలువడే అవకాశం ఉంది.

ప్రస్తుత జీఎస్టీ స్లాబ్లు:
భారత దేశంలో నాలుగు ప్రధాన జీఎస్టీ స్లాబ్లు 5%, 12%, 18%, 28% ఉన్నాయి. ఇప్పుడు 12% స్లాబ్లో ఉన్న కొన్ని వస్తువులను లేదా మొత్తం ఆ స్లాబ్ ను 5% స్లాబ్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనివల్ల ఆ వస్తువులపై పన్ను తగ్గి, మార్కెట్లో ధరలు తగ్గే అవకాశం ఉంది.
12% స్లాబ్లో ఉన్న ముఖ్యమైన వస్తువులు:
కండెన్స్డ్ మిల్క్ (Condensed Milk), చీజ్ (Cheese), డ్రైడ్ ఫ్రూట్స్ (Dry Fruits), జామ్, ఫ్రూట్ జ్యూస్ బాటిల్, పాస్తా, 20 లీటర్ వాటర్ బాటిల్స్, కాంటాక్ట్ లెన్సెస్, సైకిళ్లు, ఫీడింగ్ బాటిల్స్, గొడుగులు, రూ. 1,000 లోపు చెప్పులు, స్లిప్పర్లు, కాటన్ హ్యాండ్బ్యాగ్స్, మార్బుల్, గ్రానైట్ బ్లాక్స్, విద్యా సంబంధిత స్టేషనరీ, మ్యాప్స్, గ్లోబ్స్.
ఎందుకు తగ్గిస్తున్నారు జీఎస్టీ?
మధ్యతరగతి మరియు తక్కువ ఆదాయ గలవారు ఎక్కువగా వినియోగించే వస్తువులపై పన్ను తగ్గించడం ద్వారా నెలవారీ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. పల్లె ప్రాంతాల్లో రోజువారీ వస్తువులపై ఎక్కువ టాక్స్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని 5%కి తేల్చడం వల్ల మరింత ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. ధరల పెరుగుదల (Inflation) అదుపులో ఉంచేందుకు పన్ను తగ్గింపు ఒక కీలక వ్యూహంగా కేంద్రం తీసుకుంటోంది.
జీఎస్టీ తగ్గితే సాధారణ కుటుంబాలకు మంచి ఉపశమనం కలుగుతుంది. టూత్పేస్ట్, వంట పాత్రలు, బట్టలు, పాదరక్షలు వంటి రోజూ ఉపయోగించే వస్తువులపై పన్ను తగ్గితే, నెలకు రూ. 200 నుంచి రూ. 500 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ మధ్యతరగతి కుటుంబాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే స్టూడెంట్స్ ఉపయోగించే స్టేషనరీ, షూస్, బైసికల్స్ వంటి వాటిపై కూడా జీఎస్టీ తగ్గితే వారి కుటుంబాలపై భారం తక్కువ అవుతుంది. ఇవి తక్కువ ధరలకు దొరుకుతాయంటే ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా మెరుగవుతుంది. ఉదాహరణ: రూ. 100 విలువైన టూత్పేస్ట్పై ఇప్పటి వరకు రూ. 12 GST (రూ. 112 మొత్తం) ఉండేది. ఇప్పుడు రూ. 5 మాత్రమే (రూ.105 మొత్తం) అవుతుంది.
మీ రోజువారీ దినచర్య లో ఉపయోగించే అనేక వస్తువుల ధరలు 5%-7% వరకు తగ్గే అవకాశం ఉంది. ఇది నెలవారీ బడ్జెట్లో స్పష్టమైన మార్పు తీసుకురావచ్చు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు. ధరలు తక్కువగా ఉండడం వల్ల వినియోగం పెరిగే అవకాశం ఉంది, దీని వల్ల చిన్న వ్యాపారాలు, రిటైల్ మార్కెట్కు కూడా లాభం.
అలాగే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రూ. 40,000-50,000 కోట్ల వరకు తాత్కాలిక ఆదాయ నష్టాన్ని కలగనుంది. కానీ ఈ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీర్ఘకాలంలో వినియోగం పెరగడం వల్ల ఆదాయం తిరిగి పెరగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications