GST News: జీఎస్టీ విధానాన్ని మోదీ ప్రభుత్వం తీసుకురావటంతో పాటు దానిని సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఇందుకోసం ఆధునిక సాంకేతికతను సైతం వినియోగిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా అనేక మోసాలు వరుసగా బయటపడుతున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.25 లక్షల కంపెనీలపై జీఎస్టీ శాఖ ఉచ్చు బిగించనుంది. ఈ కంపెనీలు జీఎస్టీ చెల్లించకుండా తప్పుడు ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ పొందినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సదరు కంపెనీలకు నోటీసులు ఇచ్చి కేంద్ర రాష్ట్ర జీఎస్టీ అధికారులు విచారణను ప్రారంభించారు. ఇందులో ప్రభుత్వ సంస్థలు, ప్రఖ్యాత కంపెనీలు కూడా ఉన్నాయని సమాచారం.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ రెండు నెలల ప్రత్యేక దర్యాప్తు డ్రైవ్ మే 14- జూలై 14 మధ్య నిర్వహించింది. ఇందులో 77,200 సంస్థలపై విచారణ జరపగా.. 20,800 నకిలీవని తేలింది. దీని తర్వాత రెండో దశలో అధికారులు 1.25 లక్షల కంపెనీలను విచారిస్తున్నారు. చాలా కంపెనీలు ఉత్పత్తిలో వినియోగించే ముడి పదార్థాలపై చెల్లించే పన్నుకు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ జీఎస్టీ తిరిగి అందిస్తుంది. అయితే ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకుండానే నకిలీ బిల్లులతో కొందరు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నందున అధికారులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు.
అంతర్గత సమాచారంతో పాటు ఇతర శాఖల నుంచి వచ్చిన ముఖ్యమైన సమాచారం ఆధారంగా అనుమానాస్పద కంపెనీల జాబితాను తయారు చేస్తారు. దీనికి తోడు వ్యాపారవేత్తలు దాఖలు చేసే కార్పొరేట్ టాక్స్ రిటర్న్స్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ డైటాను ఇందుకు వినియోగిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1.01 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేత గుర్తించబడింది. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications