అక్టోబర్ 1వ తేదీ నుండి జీఎస్టీ ఈ-ఇన్వాయిస్ తప్పనిసరి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయం ప్రకారం బిజినెస్ టు బిజినెస్ (B2B) ట్రాన్సాక్షన్స్ పైన వచ్చే నెల 1 నుండి ఈ-ఎన్కోడింగ్ తప్పనిసరి కానుంది. రూ.500 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఇది వర్తిస్తుంది. ఈ-ఇన్వాయిస్ తప్పనిసరి చేయవద్దని, స్వచ్చంధంగా ఉంచాలని ప్రభుత్వాన్ని పరిశ్రమ కోరుతోంది. అయితే చిన్న కంపెనీలకు ఈ-ఇన్వాయిస్ నుండి ఉపశమనం ఉంటుంది.
ఇదివరకు రూ.100 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న సంస్థలకు ఈ-ఇన్వాయిస్ తప్పనిసరి చేసే ప్రణాళిక తీసుకు రావాలని భావించారు. కనీస వార్షిక టర్నోవర్ పరిమితి రూ.500 కోట్లకు పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ సాధికార కమిటీ సూచించింది. ఈ-ఇన్వాయిస్ పన్ను సమ్మతిని మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి జీఎస్టీ ఈ-ఇన్వాయిస్ తప్పనిసరి చేసే ప్రణాళిక ఉంది. దీని కోసం సవరించిన తేదీగా అక్టోబర్ 1 అని కేంద్రం తెలిపింది.

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్ వర్క్ వెబ్ సైట్ ప్రకారం ఈ-ఇన్వాయిస్ వల్ల కంపెనీలకు ప్రయోజనాలు ఉంటాయి. ప్రామాణీకరణ, ఇంటర్ ఆపెరాబిలిటీ, జీఎస్టీ రిటర్న్స్, వివాదాల తగ్గింపు, చెల్లింపు చక్రాన్ని మెరుపురగచడం వంటివి ఉన్నాయి. అందుకే ఈ-ఇన్వాయిస్ విధాన సంస్థల సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుందని భావిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఈ సారి బడ్జెట్లో కొత్త పథకాలు.. అవేంటంటే..



Click it and Unblock the Notifications