జీఎస్టీ వ్యవస్థలో మరో కీలక మార్పు.. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌పై దృష్టి పెట్టిన కేంద్రం

గత సెప్టెంబర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అనేక అవసరమైన వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ చర్య వలన ఎరువులు, బట్టలు, సైకిళ్లు వంటి ముఖ్యమైన వినియోగ వస్తువులపై పన్ను భారాన్ని తగ్గించడమే కాకుండా, పరిశ్రమలకు కొంత ఊరట లభించింది. అయితే ఇది జీఎస్టీ వ్యవస్థలో ఉన్న ఒక కీలక అంశాన్ని.. చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించలేదు. అదే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అనే లోపం.

సాధారణంగా సరుకులు తయారయ్యేటప్పుడు ముడి పదార్థాలపై ఒక రకమైన పన్ను, తుది ఉత్పత్తులపై మరో రకమైన పన్ను విధిస్తారు. కానీ కొన్ని రంగాల్లో పరిస్థితి తారుమారైంది. అంటే ముడి పదార్థాలపై అధిక పన్ను, తుది ఉత్పత్తులపై తక్కువ పన్ను విధిస్తున్నారు. దీనినే రివర్స్ ఛార్జ్ టాక్స్ లేదా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటారు. ఈ తారుమారైన నిర్మాణం వల్ల వ్యాపారులు ముందు ముడి సరుకు కొనే సమయంలో ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది. కానీ వారు తయారుచేసిన వస్తువును అమ్మేటప్పుడు తక్కువ పన్ను మాత్రమే వసూలు చేయగలరు. దీంతో వారు చెల్లించిన అధిక పన్నును ప్రభుత్వానికి రీఫండ్ రూపంలో అడగాల్సి వస్తోంది. ఇది వ్యాపారాల్లో పెట్టుబడులను తగ్గిస్తుంది, లిక్విడిటీ సమస్యలను సృష్టిస్తుంది. పరిశ్రమల వేగాన్ని దెబ్బతీస్తుంది.

GST Council GST rate cuts inverted duty structure GST anomalies tax reform India GST rationalisation duty imbalance GST Council meeting GST rate revision supply chain impact input tax credit issues GST policy changes Indian economy tax GST sector reforms indirect tax India GST GST GST GST GST

సెప్టెంబర్‌లో కొన్ని రేట్లు తగ్గించినప్పటికీ, ఇది పాక్షిక పరిష్కారం మాత్రమే. ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ మరికొన్ని రంగాల్లో ఇన్వర్టెడ్ డ్యూటీ సమస్యను సరిచేయడానికి సిద్ధమైంది. కొన్ని రైల్వే విడిభాగాలు, లోహ ఖనిజాలు, మోటారు పంపులు వంటి వస్తువులపై పన్ను రేట్లను మళ్లీ సమీక్షించాలని చూస్తోంది. అదేవిధంగా, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన జీఎస్టీ నిర్మాణాన్ని పూర్తిగా పునఃపరిశీలించేందుకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నేతృత్వంలో ప్రత్యేక మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేశారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి నేతృత్వంలోని కమిటీ ఈ అంశంపై ఇప్పటికే ఎక్కువభాగం పని పూర్తి చేసింది.

ఇన్వర్టెడ్ డ్యూటీ కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు రూ. 30 వేల కోట్ల వరకు రీఫండ్ అభ్యర్థనలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం 2021లో అంచనా వేసింది. ఈ పెద్ద మొత్తంలో రీఫండ్ క్లెయిమ్‌లు వివాదాలకు దారితీస్తున్నందున, నవంబర్ 1 నుండి ప్రభుత్వం కొత్త తాత్కాలిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా, వ్యాపారులు సమర్పించిన నిర్దిష్ట డేటాను ధృవీకరించిన వెంటనే, రీఫండ్ అభ్యర్థనలలో 90 శాతం మొత్తాన్ని తక్షణమే చెల్లించడానికి చర్యలు చేపట్టారు. ఇది వ్యాపారులకు పెద్ద ఊరటగా భావిస్తున్నారు.

ప్రస్తుత మార్పులను నిపుణులు స్వాగతించినప్పటికీ, వారి అభిప్రాయం ప్రకారం ఇంకా మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రీఫండ్ సౌకర్యం కేవలం ముడి పదార్థాలపై చెల్లించిన పన్నుకు మాత్రమే వర్తిస్తోంది. నిపుణులు ఈ ప్రయోజనాన్ని మూలధన వస్తువులు (యంత్రాలు), ఇన్‌పుట్ సేవలు (రవాణా, వేతన సేవలు)పై చెల్లించే అదనపు పన్నుకు కూడా విస్తరించాలని కోరుతున్నారు. ఇది పరిశ్రమలకు మరింత న్యాయం చేస్తుందని వారు చెబుతున్నారు.

GST వ్యవస్థను సులభతరం చేయడం, అనవసరమైన వివాదాలను తగ్గించడం, పరిశ్రమలకు స్పష్టత ఇవ్వడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఫిబ్రవరికి ముందు జరగనుంది. ఈ సమావేశంలో ఇన్వర్టెడ్ డ్యూటీ సమస్యపై మరింత స్పష్టమైన నిర్ణయాలు వెలువడే అవకాశముంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+