న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని ఆవరించుకున్నప్పటి పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసుల్లాగే- దాని తీవ్రత తగ్గింది. దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పట్టాలెక్కుతోంది. గాడిన పడుతోంది. రోజువారీ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్వస్థితికి చేరుకుంటోన్నాయి. అన్ని రంగాలు కూడా కుదుట పడుతున్నాయి. దీనికి నిదర్శనమే- కిందటి నెల అంటే అక్టోబర్లో వసూలైన వస్తు, సేవా పన్నుల వసూళ్ల. కిందటి నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లు వసూలయ్యాయి.

జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత.. రెండో అత్యధికం..
అక్టోబర్లో నమోదైన జీఎస్టీ వసూళ్లు- 1,30,127 కోట్ల రూపాయలు. దేశంలో జీఎస్టీ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత.. ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం ఇది రెండోసారి మాత్రమే. ఈ ఏడాది ఏప్రిల్లో రికార్డు స్థాయిలో 1,41,384 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైంది. అది హయ్యెస్ట్. కిందటి నెలలో రెండో అత్యధిక మొత్తంలో జీఎస్టీ వసూళ్లు నమోదు అయ్యాయి. జీఎస్టీ రూపంలో 1,30,127 కోట్ల రూపాయలు అందినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.

స్టేట్ జీఎస్టీ వాటా ఎక్కువ..
అంతకుముందు నెల అంటే సెప్టెంబర్తో పోల్చుకుంటే జీఎస్టీ వసూళ్లల్లో 24 శాతం మేర పెరుగుదల చోటు చేసుకుంది. ఈ మొత్తంలో సెంట్రల్ జీఎస్టీ (CGST)-23,861 కోట్ల రూపాయలు. కాగా.. స్టేట్ జీఎస్టీ (SGST)-30,421 కోట్ల రూపాయలు. ఇక ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) రెవెన్యూ మొత్తం 67,361 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇందులో సరుకుల దిగుమతి ద్వారా నమోదైన జీఎస్టీ మొత్తం 29,599 కోట్ల రూపాయలు.

మళ్లీ గాడినపడ్డట్టే..
వేర్వేరు రంగాలపై విధించిన సెస్ ద్వారా 8,484 కోట్ల రూపాయలు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సరుకుల దిగుమతులపై విధించిన సెస్ ద్వారా 699 కోట్ల రూపాయలను ఇందులోనే మిళితం చేసినట్లు తెలిపింది. లక్ష కోట్ల రూపాయలకుకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం వరుసగా కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది జూన్ నెలను మినహాయించితే- ప్రతీనెలా జీఎస్టీ రూపంలో కేంద్రానికి అందుతోన్న ఆదాయం లక్ష కోట్ల రూపాయలకు పైమాటే. జూన్లో ఈ సంఖ్య 92,849 రూపాయలకే పరిమితమైంది.

ఏపీలో గ్రోత్ రేట్ అధికం..
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా నమోదైన జీఎస్టీ కలెక్షన్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో జీఎస్టీ కలెక్షన్లు పెరిగాయి. ఏపీలో గత ఏడాది అక్టోబర్లో నమోదైన జీఎస్టీ కలెక్షన్లు 2,480 కోట్ల రూపాయలు. కాగా ఈ ఏడాది అదే అక్టోబర్ నెలకు ఈ సంఖ్య పెరిగింది. 2,879 కోట్ల రూపాయల జీఎస్టీని నమోదు చేసింది. గత ఏడాది అక్టోబర్తో పోల్చి చూస్తే- ఈ నెల16 శాతం మేర అధిక రెవెన్యూ సాధించింది.

తెలంగాణ 14 శాతం..
తెలంగాణలో జీఎస్టీ వసూళ్లలో 14 శాతం మేర పెరుగుదల కనిపించింది. గత ఏడాది అక్టోబర్లో తెలంగాణ నమోదు చేసిన జీఎస్టీ మొత్తం- 3,383 కోట్ల రూపాయలు. ఈ ఏడాది అదే అక్టోబర్ నెలకు 3,854 కోట్ల రూపాయలను అందుకుంది. ఈ రెండింటి మధ్య 14 శాతం పెరుగుదల నెలకొంది. జీఎస్టీ కలెక్షన్లలో మహారాష్ట్ర వాటా అధికం. 19,355 కోట్ల రూపాయల మేర వసూళ్లు నమోదయ్యాయి ఆ రాష్ట్రంలో. గత ఏడాది ఇదే అక్టోబర్ నెలలో జీఎస్టీ కలెక్షన్లు 15,799 కోట్ల రూపాయలు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications