సెప్టెంబర్ 3 బుధవారం నాడు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. పొగాకు ఉత్పత్తులపై కౌన్సిల్ భారీగా పన్ను రేట్లు పెంచినప్పటికీ.. బీడీపై మాత్రం పన్ను రేట్లు అలాగే ఉంచింది. ఇప్పటివరకు 28 శాతం GST విధిస్తున్న బీడీలపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ మాత్రమే విధించనున్నారు. అంతేకాదు, బీడీ తయారీలో ఉపయోగించే టెండు ఆకులపై కూడా 18 శాతం నుంచి 5 శాతానికి పన్ను తగ్గింపును ప్రకటించారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దాని వెనుక ఉన్న ఆర్థిక, సామాజిక కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు చర్చకు వచ్చింది.
భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బీడీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 49 లక్షలకు పైగా రిజిస్టర్డ్ బీడీ కార్మికులు ఉన్నారు. వీరిలో అధిక శాతం చిన్న పట్టణాలు, గ్రామాల నుండి వచ్చినవారే. ఇంకా చెప్పాలంటే.. మహిళలు ఈ పరిశ్రమలో ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తున్నారు. ఇంటి ఆధారిత పనిగా ఉండటం వల్ల పిల్లల సంరక్షణ, వ్యవసాయ పనులతో పాటు బీడీ రోలింగ్ చేయడం వారికి వీలవుతోంది. వాస్తవానికి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో 90 శాతం మహిళలే ఉన్నారంటే వారి ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.

ఈ పరిశ్రమలో వేతనాలు కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ 2023లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2010-11లో బీడీ కార్మికులు ఒక సగటు కార్మికుడు సంపాదించే వేతనం లో కేవలం 17 శాతం మాత్రమే సంపాదించారని తెలుస్తోంది. ఉదాహరణకు, పశ్చిమ బెంగాల్లో 1,000 బీడీలకు సుమారు రూ.150 మాత్రమే చెల్లిస్తారు. ఒక వ్యక్తి రోజుకు 400-700 బీడీలు తయారు చేస్తే, అందిన పారితోషికం వారి కుటుంబ జీవనానికి కూడా సరిపోదు.
ఇలాంటి పరిస్థితుల్లో బీడీలపై పన్ను తగ్గించడం అంటే రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది, బీడీలు మరింత చౌకగా లభించడం వల్ల వినియోగం పెరగవచ్చు. రెండవది, బీడీ తయారీదారులకు, ముఖ్యంగా గ్రామీణ మహిళా కార్మికులకు, స్థిరమైన ఉపాధి అవకాశాలు కొనసాగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిశ్రమలో ఉపాధి కోల్పోతే లక్షలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని మోదీ సర్కారు గుర్తించింది.
ఇంకా ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. టెండు ఆకులపై పన్ను తగ్గింపు. మధ్య భారతదేశంలోని అనేక ఆదివాసీ, గ్రామీణ కుటుంబాలు ఈ ఆకులను సేకరించి జీవనం సాగిస్తాయి. వీటిని చిన్న అటవీ ఉత్పత్తులుగా పరిగణిస్తారు. టెండు ఆకులపై జీఎస్టీ తగ్గించడం వల్ల బీడీ తయారీ ఖర్చులు తగ్గుతాయి. దీంతో, గ్రామీణ, అటవీ ఆధారిత జీవనోపాధులు రక్షింపబడతాయి.
అయితే ఈ నిర్ణయంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బీడీలు ఆరోగ్యానికి హానికరం కావడం వల్ల వీటిపై పన్ను తగ్గించక పోవడంపై ఆరోగ్య నిపుణులు విమర్శిస్తున్నారు. చౌకైన బీడీలు మరింత మందిని ధూమపానం వైపు తీసుకువెళతాయని వారు హెచ్చరిస్తున్నారు. పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు వంటి ఇతర పొగాకు ఉత్పత్తులపై పన్నులు 40 శాతం వరకు పెంచిన నేపథ్యంలో బీడీలకు ఇచ్చిన రాయితీ విరుద్ధంగా కనిపిస్తోందని అంటున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై చెబుతున్నదేంటంటే.. పరిహార సెస్ ఖాతా కింద ఉన్న రుణాలు, వడ్డీ చెల్లింపులు పూర్తయ్యే వరకు బీడీలపై ప్రస్తుత జీఎస్టీ, సెస్ కొనసాగుతుందని అంటోంది. అంటే రాబోయే కాలంలో బీడీలపై మళ్లీ మార్పులు రావచ్చన్న సంకేతాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి.ఏదేమైనా.. బీడీలపై జీఎస్టీ తగ్గింపు కేవలం వినియోగదారుల కోసమే కాదు.. వెనుకబడిన వర్గాల జీవనోపాధిని కాపాడే ప్రయత్నమని చెప్పవచ్చు. అయితే ఇది ప్రజా ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందనేది ముందు ముందు చూడాలి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications