సెప్టెంబర్ 3 బుధవారం నాడు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. పొగాకు ఉత్పత్తులపై కౌన్సిల్ భారీగా పన్ను రేట్లు పెంచినప్పటికీ.. బీడీపై మాత్రం పన్ను రేట్లు అలాగే ఉంచింది. ఇప్పటివరకు 28 శాతం GST విధిస్తున్న బీడీలపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ మాత్రమే విధించనున్నారు. అంతేకాదు, బీడీ తయారీలో ఉపయోగించే టెండు ఆకులపై కూడా 18 శాతం నుంచి 5 శాతానికి పన్ను తగ్గింపును ప్రకటించారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దాని వెనుక ఉన్న ఆర్థిక, సామాజిక కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు చర్చకు వచ్చింది.
భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బీడీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 49 లక్షలకు పైగా రిజిస్టర్డ్ బీడీ కార్మికులు ఉన్నారు. వీరిలో అధిక శాతం చిన్న పట్టణాలు, గ్రామాల నుండి వచ్చినవారే. ఇంకా చెప్పాలంటే.. మహిళలు ఈ పరిశ్రమలో ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తున్నారు. ఇంటి ఆధారిత పనిగా ఉండటం వల్ల పిల్లల సంరక్షణ, వ్యవసాయ పనులతో పాటు బీడీ రోలింగ్ చేయడం వారికి వీలవుతోంది. వాస్తవానికి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో 90 శాతం మహిళలే ఉన్నారంటే వారి ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.

ఈ పరిశ్రమలో వేతనాలు కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ 2023లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2010-11లో బీడీ కార్మికులు ఒక సగటు కార్మికుడు సంపాదించే వేతనం లో కేవలం 17 శాతం మాత్రమే సంపాదించారని తెలుస్తోంది. ఉదాహరణకు, పశ్చిమ బెంగాల్లో 1,000 బీడీలకు సుమారు రూ.150 మాత్రమే చెల్లిస్తారు. ఒక వ్యక్తి రోజుకు 400-700 బీడీలు తయారు చేస్తే, అందిన పారితోషికం వారి కుటుంబ జీవనానికి కూడా సరిపోదు.
ఇలాంటి పరిస్థితుల్లో బీడీలపై పన్ను తగ్గించడం అంటే రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది, బీడీలు మరింత చౌకగా లభించడం వల్ల వినియోగం పెరగవచ్చు. రెండవది, బీడీ తయారీదారులకు, ముఖ్యంగా గ్రామీణ మహిళా కార్మికులకు, స్థిరమైన ఉపాధి అవకాశాలు కొనసాగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిశ్రమలో ఉపాధి కోల్పోతే లక్షలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని మోదీ సర్కారు గుర్తించింది.
ఇంకా ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. టెండు ఆకులపై పన్ను తగ్గింపు. మధ్య భారతదేశంలోని అనేక ఆదివాసీ, గ్రామీణ కుటుంబాలు ఈ ఆకులను సేకరించి జీవనం సాగిస్తాయి. వీటిని చిన్న అటవీ ఉత్పత్తులుగా పరిగణిస్తారు. టెండు ఆకులపై జీఎస్టీ తగ్గించడం వల్ల బీడీ తయారీ ఖర్చులు తగ్గుతాయి. దీంతో, గ్రామీణ, అటవీ ఆధారిత జీవనోపాధులు రక్షింపబడతాయి.
అయితే ఈ నిర్ణయంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బీడీలు ఆరోగ్యానికి హానికరం కావడం వల్ల వీటిపై పన్ను తగ్గించక పోవడంపై ఆరోగ్య నిపుణులు విమర్శిస్తున్నారు. చౌకైన బీడీలు మరింత మందిని ధూమపానం వైపు తీసుకువెళతాయని వారు హెచ్చరిస్తున్నారు. పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు వంటి ఇతర పొగాకు ఉత్పత్తులపై పన్నులు 40 శాతం వరకు పెంచిన నేపథ్యంలో బీడీలకు ఇచ్చిన రాయితీ విరుద్ధంగా కనిపిస్తోందని అంటున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై చెబుతున్నదేంటంటే.. పరిహార సెస్ ఖాతా కింద ఉన్న రుణాలు, వడ్డీ చెల్లింపులు పూర్తయ్యే వరకు బీడీలపై ప్రస్తుత జీఎస్టీ, సెస్ కొనసాగుతుందని అంటోంది. అంటే రాబోయే కాలంలో బీడీలపై మళ్లీ మార్పులు రావచ్చన్న సంకేతాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి.ఏదేమైనా.. బీడీలపై జీఎస్టీ తగ్గింపు కేవలం వినియోగదారుల కోసమే కాదు.. వెనుకబడిన వర్గాల జీవనోపాధిని కాపాడే ప్రయత్నమని చెప్పవచ్చు. అయితే ఇది ప్రజా ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందనేది ముందు ముందు చూడాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications