RBI News: స్టాక్ మార్కెట్లో వివిధ బ్రోకింగ్ సంస్థలు ఏళ్ల తరబడి సేవలందిస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ఇన్వెస్టర్ల అభిమానాన్ని చూరగొని, భారీ స్థాయిలో మార్కెట్ షేర్ సొంతం చేసుకున్నాయి. వాటిలో అప్స్టాక్స్, జెరోధాలు ముందు వరుసలో ఉన్నాయి. అయితే వాటికి పోటీగా రంగంలోకి దిగిన 'గ్రో' తన సత్తా చాటుతోంది.
పేమెంట్ అగ్రిగేటర్గా చెల్లింపులు నిర్వహించేందుకు ఫిన్టెక్ యునికార్న్ 'గ్రో'ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించింది. బ్రోకింగ్ సంస్థ గ్రో UPI పేమెంట్ ప్లాట్ఫారమ్ 'గ్రో పే'కి ఈ మేరకు RBI లైసెన్స్ మంజూరు చేసింది. దీంతో టైగర్ గ్లోబల్, పీక్ XV పార్టనర్స్ మద్ధతు కలిగిన ఆ సంస్థకు UPI ద్వారా ఇ-కామర్స్ లావాదేవీలు సులభతరం చేసేందుకు అవకాశం లభిస్తోంది.

గ్రో యూపీఐ గతేడాది జూలైలో ప్రారంభించబడింది. లోన్స్ మరియు క్రెడిట్ కార్డ్ రీపేమెంట్లు, విద్యుత్ మరియు నీటి బిల్లులు చెల్లించడం, DTH మరియు మొబైల్ రీఛార్జ్ వంటి బిల్లుల చెల్లింపు సేవలను ఆ యాప్ అనుమతిస్తోంది. తాజాగా RBI నుంచి లైసెన్స్ కూడా రావడం సంస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
యాక్టివ్ యూజర్ల పరంగా గతేడాది అక్టోబర్లో గ్రో తన ప్రత్యర్థి జెరోధాను మొదటిసారి అధిగమించింది. 2023లో 7.5 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. కాగా జెరోధా 6.7 మరియు ఏంజెల్ వన్ 5.3 మిలియన్ MAUలతో తర్వాతి స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక వాల్యుయేషన్ పరంగానూ జెరోధాతో పోటీ పడుతోంది. 3.6 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలవగా, గ్రో 3 బిలియన్ డాలర్లతో తన హవా కొనసాగిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications