ఇప్పుడు మనం చూస్తున్నా, భారతదేశం ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నట్లు అనిపిస్తోంది, అసలు విషయం ఏంటంటే, మనం అభివృద్ధి చెందుతున్న దేశంలో జీవిస్తున్నా, ఆ అభివృద్ధి ఫలితాలు మన వరకు రావడం లేదు. ఎందుకంటే... ఆ అభివృద్ధి కేవలం కొందరికి మాత్రమే దక్కుతోంది అని ఇప్పుడు ఓ ఫైనాన్షియల్ అనలిస్ట్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. "భారతదేశంలో ఆదాయ అసమానతలు ఇప్పుడు బ్రిటీష్ కాలం కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. దీనితో పాటు పేదలు మరియు ధనికుల మధ్య దూరం కూడా మరింత పెరిగిపోతుంది.

హార్దిక్ జోషి అనే ఆర్థిక విశ్లేషకుడు ఈ విషయం గురించి ఒక శక్తివంతమైన వ్యాఖ్య చేశారు: మీకు అవునా అనిపించవచ్చు, కానీ గణాంకాలు చూస్తే నిజమే. దేశంలోని 1% మంది ప్రజలు 40% దాటిన ఆస్తిని కలిగి ఉండగా, సగం ప్రజలు కేవలం 6% వాటాతో జీవిస్తున్నారు. ఈ అసమానతలు ఎందుకు పెరిగాయో, ఈ వ్యవస్థ మరింత మందిని నష్టపరిచేది ఎందుకు అవుతుందో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది.
పొలాల్లో పని చేసే రైతు, ఫ్యాక్టరీలో కూలీగా పని చేసే కార్మికుడు, డెలివరీ అబ్బాయి, స్కూల్ టీచర్, వీళ్ళు రోజంతా కష్టపడతారు. కానీ వారి ఆదాయం మాత్రం నిత్యం పోతున్న ధరలకు సరిపోడు. దీన్ని చూస్తే, మనం అభివృద్ధి చెందుతున్నామా? లేక కేవలం కొందరు అభివృద్ధి చెందుతుండగా మిగతావాళ్లు అక్కడే నిల్చిపోయారా అన్న సందేహం తలెత్తుతుంది.
అసమానతలు యాదృచ్ఛికంగా పుట్టలేదట నిపుణుడు చెప్పిన ప్రకారం చెబుతున్నది నిజం ఇది కొంతమందికే లాభపడే విధంగా రూపొందించిన పాలసీల ఫలితం. కార్పొరేట్ టాక్స్ తగ్గించడం, కార్మిక హక్కులను ఉల్లంఘించే సంస్కరణలు, ప్రభుత్వ ఆదాయంలో పన్నుల వాటా తక్కువవడం ఇవన్నీ దీని వెనుక ఉన్న అసలు కారణాలు. మరింత గమనించాల్సిన విషయం ఏంటంటే, అసమానతలు శక్తివంతులకే ప్రమాదం అన్న భావన వాస్తవానికి సరైనది కాదు. అసలు, ఈ అసమానతలే కొందరికి ప్రయోజనంగా మారాయి.
ఈ పరిస్థితిలో మార్పు ఎలా?
మన దేశం నిజంగా అభివృద్ధి కావాలంటే అభివృద్ధి అనేది కేవలం టవర్ల లోని ఇంజినీర్లు, స్టార్టప్ కంపెనీల్లో డైరెక్టర్లకే కాకుండా గ్రామంలో వున్న చిన్న రైతు, కాలనీలో నివసించే మధ్యతరగతి యువతికి కూడా చేరాలి.
ఏం చేయాలి అంటే?
ధనవంతులపై సరైన పన్ను విధానం అమలవ్వాలి. చిన్న వ్యాపారాలకు మద్దతుగా ప్రభుత్వ చర్యలు ఉండాలి. ఆరోగ్యం, విద్య వంటి అవసర రంగాల్లో పెట్టుబడులు పెరగాలి. కార్మిక హక్కులను రక్షించాలి. వాస్తవిక డేటాపై ఆధారపడి అభివృద్ధి లక్ష్యాలు నిర్ణయించాలి.
మనకు స్వాతంత్ర్యం వచ్చింది కానీ స్వేచ్ఛ అందరికీ సమానంగా ఉందా? ధనం పోటులో ముందు పరిగెత్తేవారికి గోల్డ్ మెడల్ పడుతోంది కానీ మిగిలినవారు మాత్రం స్టార్ట్ లైన్ దగ్గరే నిలబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశ్నించడం తప్పు కాదు. మనం ఎవరి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామో, ఆ అభివృద్ధి ఎవరికి దక్కుతుందో ఒకసారి మనమూ ఆలోచించాలి.
ఇప్పటికి మన దేశంలో అభివృద్ధి పేరుతో పెద్దగా మాట్లాడుతున్నా, వాస్తవానికి సామాన్య ప్రజల జీవితాల్లో ఒత్తిడి మాత్రం రోజురోజుకీ పెరుగుతోంది. పేదరికం, ఆకలి, సరైన ఆరోగ్య సేవల కొరత ఇవన్నీ తీవ్రమవుతున్నాయి. దేశ GDP పెరుగుతోంది, కానీ ఆ అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి సమానంగా అందడం లేదు. 2014 నుంచి 2022 మధ్య అపారమైన సంపద దేశంలో కలిగినా, దాని లాభాల్లో పేదవర్గాల భాగస్వామ్యం దాదాపు కనిపించకుండా పోయింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications