Income Tax Rates: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొన్ని రోజుల్లో ఆర్థిక మంత్రిగా వార్షిక బడ్జెట్ ప్రసంగాన్ని ఇవ్వనున్నారు. ఈ క్రమంలో కొత్త టాక్స్ విధానం కింద పెద్ద ప్రకటన రావొచ్చనే అంచనాలు అంతటా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో బడ్జెట్ పై GoodReturns.in దీనిపై నిర్వహించిన పోల్ ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో రూ.10 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు, 15-20 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను శ్లాబ్ ప్రవేశపెట్టడం వంటి అంశాలు ఉన్నాయి. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం క్యాపెక్స్ పెంచటం ద్వారా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని వేగవంతం చేయవచ్చనే ఆశలు ఉన్నాయి.

ఈ సారి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ వినియోగం పెంచటానికి మద్దతు ఇవ్వడం, ఉద్యోగ సృష్టికి మద్దతుగా తయారీ పోటీతత్వాన్ని పెంచడం, దేశంలోని ప్రజల సామర్థ్యాన్ని వినియోగించుకోవడం, వ్యవసాయ పరిశోధన-అభివృద్ధికి అధిక కేటాయింపుల వంటివి ఉంటాయని కేర్ ఎడ్జ్ రేటింగ్ ప్రతినిధి సచిన్ గుప్తా వెల్లడించారు. ఇదే క్రమంలో ప్రభుత్వ రైతుల సంక్షేమంతో పాటు విద్యుత్, రవాణా వంటి రంగాల్లో ఇండియాలో మౌలిక వసతుల అంతరాన్ని తగ్గించే ప్రయత్నం ఉంటుందని వెల్లడించారు. అలాగే ఆర్థిక క్రమశిక్షణపై బడ్జెట్ దృష్టి సారించే అవకాశం ఉందన్నారు.
ఇదే క్రమంలో కోటక్ సెక్యూరిటీస్ ప్రతినిధి శ్రీపాల్ షా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచటానికి పన్ను రేట్లను తగ్గించాలని అన్నారు. రాబోయే బడ్జెట్ రిటైల్ పెట్టుబడిదారులకు ముఖ్యంగా తక్కువ ఆదాయ స్లాబ్ల్లో పన్ను ఉపశమనంపై ఆశలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే క్రమంలో దాదాపు 54 మంది మార్కెట్ ప్రతినిధుల నుంచి గుడ్ రిటర్న్స్ ఈ నెల 25-27 వరకు అభిప్రాయాలను సేకరించింది. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి ఈసారి మధ్య ఆదాయం నుంచి అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రజలపై దృష్టి పెడుతుందని అన్నారు. ఈ క్రమంలో దాదాపు 30 మంది కొత్త పన్ను విధానం కింద టాక్స్ తగ్గింపు ఉండవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కొత్త పన్ను విధానంలోని శ్లాబ్ రేట్లు..
- 0 నుంచి రూ.3 లక్షల వరకు- 0 శాతం టాక్స్
- రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు- 5 శాతం టాక్స్
- రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు- 10 శాతం టాక్స్
- రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు- 15 శాతం టాక్స్
- రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు- 20 శాతం టాక్స్
- రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం పన్ను ఉంది
వాస్తవానికి పాత పన్ను విధానం కింద కొనసాగటం వల్ల ప్రజలకు అనేక మినహాయింపులు ఉండటం వల్ల చాలా మంది ఇప్పటికీ దానినే ఫాలో అవుతున్నారు. అయితే కేంద్రం మాత్రం ప్రజలను మెల్లగా కొత్త పన్ను విధానానికి షిఫ్ట్ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే న్యూ టాక్స్ రీజిమ్ డిఫాల్ట్ గా మార్చేసింది. అందుకే గత ఏడాది ఆర్థిక మంత్రి బడ్జెట్ సమయంలో కొత్త పన్ను విధానం కింద పన్ను మినహాయింపును రూ.7 లక్షల వరకు పెంచింది. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలకు పెంచింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications