కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ 3 శాతం పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం

లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్తను అందించింది. కేంద్ర మంత్రివర్గం ఈ రోజు కరవు భత్యం (DA), కరవు ఉపశమనం (DR)లో 3 శాతం పెంపును ఆమోదించింది. ఈ పెంపు జూలై 1 నుండి అమలులోకి వస్తుంది. అక్టోబర్‌లో పెరిగిన జీతంతో పాటు ఉద్యోగులు మూడు నెలల బకాయిలను కూడా పొందుతారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఆయన తెలిపినట్లుగా ఈ నిర్ణయం 4.9 మిలియన్ల ఉద్యోగులు, 6.9 మిలియన్ల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 10,084 కోట్లు భారం తగ్గుతుందని పేర్కొన్నారు.

బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీకోసం.. అధిక వడ్డీ రేటుతో..

కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు సార్లు ప్రభుత్వ ఉద్యోగుల DAను పెంచుతుంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కరవు ఉపశమనం (DR) కూడా పొందుతారు. ఇప్పటివరకు, కేంద్ర ఉద్యోగులు తమ ప్రాథమిక జీతంలో 55 శాతం DA పొందుతూ వచ్చారు. గతంలో, జనవరి 1, 2025 నుండి DA 2 శాతం పెరిగింది. అయితే, ఇది గత ఆరు సంవత్సరాల్లో అత్యల్ప పెరుగుదలగా నమోదు అయ్యింది.

DA hike 2025 dearness allowance increase govt employees DA 3 DA hike central government employees salary Diwali DA hike Cabinet approves DA employee salary boost Dearness Allowance news govt staff salary increase DA 2025 3 DA hike DA hike DA Dearness Allowance

ఈ కొత్త 3 శాతం పెంపుతో, DA రేటు 58 శాతానికి చేరుతుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి ప్రాథమిక జీతం రూ. 50 వేలు అయితే, ఇప్పటివరకు 55 శాతం DA ద్వారా అతనికి రూ. 27,500 లభించేది. ఇప్పుడు 58 శాతం DA రేటుతో అతనికి రూ. 29,000 లభిస్తుంది. దీనివల్ల ప్రతి నెలా జీతం రూ. 1,500 పెరుగుతుంది.పెన్షనర్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక పెన్షనర్ ప్రాథమిక పెన్షన్ రూ. 25,000 అయితే, 55 శాతం DA రేటుతో అతనికి రూ. 13,750 లభించేది. ఇప్పుడు 58 శాతం DA రేటుతో, అతనికి రూ.14,500 లభిస్తుంది. అంటే పెన్షన్ ప్రతి నెలా రూ. 750 పెరుగుతుంది.

ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. దీపావళి పండుగలకు ముందు ఈ పెంపు ప్రకటించడం ఉద్యోగులకు సహయపడనుంది. జీతం పెరగడం వల్ల వార్షిక ఖర్చులు, కుటుంబ అవసరాలు సులభంగా ఎదుర్కొనే అవకాశం కలుగుతుంది. కేంద్ర మంత్రివర్గం నిర్ణయం ప్రకారం, 3 శాతం DA పెంపు ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రత్యేక ప్రయోజనం ఇస్తుంది. జూలై 1 నుండి అమలులోకి వచ్చే ఈ పెంపు ప్రతి నెల జీతానికి, పెన్షన్‌కు ప్రత్యక్ష లాభాన్ని కల్పిస్తుందని చెప్పవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+