కేంద్ర ప్రభుత్వం దేశీయ విమానయాన రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. సుమారు ఐదేళ్ల విరామం తర్వాత దేశంలోని మరో 11 కీలక విమానాశ్రయాలను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సిద్ధమైంది. దీని ద్వారా ప్రభుత్వం సుమారు రూ. 6,000 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం విమాన ప్రయాణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏయే విమానాశ్రయాలు ఈ జాబితాలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఒకటి లాభం.. ఒకటి నష్టం! కొత్తగా 'బండ్లింగ్' విధానం
ఈసారి ప్రభుత్వం ఒక ఆసక్తికరమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనినే 'బండ్లింగ్' విధానం అంటున్నారు. అంటే ఎక్కువ లాభాలు వచ్చే పెద్ద ఎయిర్పోర్ట్ తో పాటు, తక్కువ ఆదాయం వచ్చే చిన్న ఎయిర్పోర్ట్ ను కలిపి ఒకే ప్యాకేజీగా విక్రయిస్తారు. దీనివల్ల చిన్న విమానాశ్రయాల్లో కూడా మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఉన్న 5 ప్యాకేజీలు ఇవే..
ప్రస్తుతానికి ప్రభుత్వం మొదటి దశగా.. ఒక ఐదు ఎయిర్ పోర్ట్ ప్యాకేజీలను రెడీ చేసింది. అవేంటంటే..
- వారణాసి - కుషీనగర్ - గయా
- అమృత్సర్ - కాంగ్రా
- భువనేశ్వర్ - హుబ్లీ
- రాయ్పూర్ - ఔరంగాబాద్
- తిరుచిరాపల్లి - తిరుపతి
మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి విమానాశ్రయం కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం.
రంగంలోకి దిగ్గజ సంస్థలు
ఈ విమానాశ్రయాలను దక్కించుకోవడానికి అదానీ గ్రూప్, జీఎంఆర్ (GMR) ఎయిర్ పోర్ట్స్ వంటి స్వదేశీ సంస్థలతో పాటు విన్సీ ఎయిర్ పోర్ట్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక్కో ప్రయాణికుడిపై ఏ సంస్థ అయితే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం (Revenue share) ఇస్తామని ఆఫర్ చేస్తుందో.. ఆ సంస్థకే కాంట్రాక్ట్ దక్కుతుంది. ఈ ప్రక్రియ అంతా ఏప్రిల్ నాటికి పూర్తి కానుంది.
విమానాశ్రయాల ప్రైవేటీకరణలో కొత్త మలుపు
ప్రభుత్వం అమలు చేస్తున్న 'బండ్లింగ్' పద్ధతి ద్వారా చాలా లాభాలే ఉన్నాయి. ఎక్కువ ఆదాయం ఇచ్చే లాభదాయకమైన విమానాశ్రయాలను, తక్కువ ఆదాయం వచ్చే చిన్న విమానాశ్రయాలతో కలిపి గ్రూపులుగా మారుస్తారు. ఇలా చేయడం వల్ల పెద్ద ఎయిర్పోర్ట్ల ద్వారా వచ్చే లాభాలను చిన్న ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి (క్రాస్-సబ్సిడీ) ఉపయోగించవచ్చు. తద్వారా ఒంటరిగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించలేని చిన్న నగరాల విమానాశ్రయాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీనిపై పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ (PPPAC) సమీక్ష చేస్తోంది. రెవెన్యూ షేరింగ్ ఎలా ఉండాలి, ప్రయాణికులపై యూజర్ డెవలప్మెంట్ ఫీజు ఎంత విధించాలి? అలాగే ఒకే కంపెనీకి ఎన్ని ఎయిర్పోర్ట్లు ఇవ్వాలి? అనే అంశాలపై వారు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయాణికుల టికెట్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
భారతదేశంలో ఈ విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రయాణం 2003లో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్ట్లతో మొదలైంది. 2006లో ఢిల్లీని జీఎంఆర్ (GMR), ముంబైని జీవీకే (GVK) దక్కించుకోగా 2021లో ముంబై ఎయిర్పోర్ట్ అదానీ గ్రూప్ చేతుల్లోకి వెళ్ళింది. ఇక రెండో విడతలో 2020-21 మధ్య కాలంలో అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, గువహటి మరియు తిరువనంతపురం విమానాశ్రయాలను ప్రభుత్వం లీజుకు ఇచ్చింది.
మొత్తానికి విమానాశ్రయాల నిర్వహణను ప్రైవేట్ చేతుల్లో పెట్టడం ద్వారా కొత్త టెక్నాలజీని, మెరుగైన సౌకర్యాలను ప్రయాణికులకు అందించాలని ప్రభుత్వం చూస్తోంది. అయితే ఇది భవిష్యత్తులో విమాన ఛార్జీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications