భారీగా పెరిగిన వంట నూనె ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అందుకే కరోనా సెకండ్ వేవ్ సమయంలో రూ.180కి పైగా ఉన్న ధరలు ఇప్పుడు రూ.150 దిగువకు వచ్చాయి. ఇప్పుడు మరి కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రిఫైన్డ్ పామ్ ఆయిల్ పైన దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి తగ్గించింది. దేశీయ సరఫరాను, వినియోగాన్ని పెంచడానికి వచ్చే మార్చి నెల వరకు రిఫైన్డ్ పామ్ ఆయిల్ బేసిక్ కస్టమ్ డ్యూటీని 17.5 శాతం నుండి 12.5 శాతానికి తగ్గించింది. ధరలు తగ్గిన నేపథ్యంలో త్వరలో రిటైల్ ధరలు కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధరలు కాస్త తగ్గింపు
బేసిక్ కస్టమ్ డ్యూటీ (BCD) తగ్గింపుతో రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్ట్ పామోలిన్ 19.25 శాతం నుండి 13.75శాతానికి తగ్గుతుందని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(SEA) తెలిపింది. సోమవారం సాయంత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) నోటిఫికేషన్ విడుదల చేసింది. రిఫైన్డ్ పామ్ ఆయిల్ పైన BCD తగ్గించామని, మార్చి 31, 2022 వరకు 17.5 శాతం నుండి 12.5 శాతానికి తగ్గినట్లు తెలిపింది.

డేటా ప్రకారం ధరలు ఇలా
కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం సగటు ధరలు సోమవారం కింది విధంగా ఉన్నాయి. పల్లి నూనె ధర రూ.181గా, మస్టర్డ్ ఆయిల్ ధర రూ.187గా, నవస్పతి నూనె రూ.138, సోయాబీన్ ఆయిల్ రూ.150, సన్ఫ్లవర్ రూ.163గా, పామ్ ఆయిల్ రూ.130గా ఉంది.
ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింపుపై SEA ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది మాట్లాడుతూ.. పామోలిన్ పైన దిగుమతి సుంకాలను తగ్గించిన నేపథ్యంలో కొనుగోలుదారులకు కూడా కాస్త భారం తగ్గుతుందన్నారు.

భారీగా దిగుమతి
భారత్ 65 శాతం ఎడిబుల్ ఆయిల్స్ను దిగుమతి చేసుకుంటోంది. మొత్తం వినియోగం 22 మిలియన్ టన్నులకు పైగా ఉండగా, 13 మిలియన్ టన్నుల నుండి 15 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకుంటోంది. కరోనా కారణంగా గత ఏడాది నవంబర్ నుండి ఈ ఏడాది అక్టోబర్ వరకు 13 మిలియన్ టన్నులకు పడిపోయింది. 2019-20లో దిగుమతులు రూ.71,600 విలువ కలిగిన 13.2 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకోగా, 2020-21లో రూ.1.17 లక్షల కోట్ల విలువ కలిగిన దిగుమతులు నమోదు చేసింది. దేశీయ నూనెల వినియోగంలో ఇది 63 శాతం.

పప్పు దినుసులు..
కందిపప్పు, మినపప్పు, పెసరపప్పుల దిగుమతులను 2022 మార్చి 31 వరకు స్వేచ్ఛా విభాగం కింద చేసుకునేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఇప్పటి వరకు ఈ గడువు 2021 డిసెంబర్ 31 వరకు ఉంది. ఈ దిగుమతులను పరిమితుల నుండి స్వేచ్ఛా విభాగంలోకి మార్చడంతో దేశీయంగా పప్పుదినుసుల సరఫరా పెరిగి, ధరలు అదుపులో ఉంటాయన్నది ప్రభుత్వ అంచనా. డిమాండ్కు తగినట్లు దేశీయంగా దిగుబడి లేనందున భారత్ పప్పు ధాన్యాలను కొంతమేర దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా పప్పు దినుసుల వినియోగం 26 మిలియన్ టన్నులు. 9.5 మిలియన్ టన్నులు పండుతుందని అంచనా.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications