ఎల్ఐసీ చైర్మన్ పదవీ కాలం పొడిగింపు, ఎందుకంటే? రిలయన్స్ కంటే పెద్ద సంస్థగా..

ప్రభుత్వరంగ బీమా దిగ్గజం LIC చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీకాలాన్ని మరో తొమ్మిది నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో IPO ప్రతిపాదన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ఈ నెల చివరలో పదవీ విరమణ చేయవలసిన కుమార్ పదవీ కాలాన్ని మార్చి 31వ తేదీ వరకు పొడిగించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసుల సూచనకు కేంద్రం ఆమోదం తెలిపింది.

ఇందుకు సంబంధించి బీమా కార్పొరేషన్ యాక్ట్, 1956 చట్టాన్ని కూడా సవరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ఈ ఏడాదిలోనే ఎల్‌ఐసీలో వాటాలను విక్రయించాలని ప్రకటించారు. అలాగే డిజిన్వెస్ట్‌మెంట్‌తో రూ.1.75 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని నిర్ణయించారు.

Government gives nine month extension to LIC chairman

కుమార్ 1983లో ఎల్ఐసీలో చేరారు. 2019 మార్చి 13వ తేదీన ఎల్ఐసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. తన నాలుగు పదుల కెరీర్‌లో ఎల్ఐసీ సదర్న్ జోన్, నార్త్ సెంట్రల్ జోన్, నార్తర్న్ జోన్‌లలో బాధ్యతలు నిర్వర్తించారు. ఎల్ఐసీలో ప్రభుత్వానికి వంద శాతం వాటా ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సమీకరించి, ఎల్ఐసీలో వాటాను తగ్గించుకోనుంది. ఎల్ఐసీ వ్యాల్యూ 261 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. లిస్టింగ్ సమయంలో ఈ మేరకు ఉంటుందని భావిస్తున్నారు. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటే ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ ఎక్కువగా ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+