4వసారి.. ఎయిరిండియా బిడ్డింగ్ గడువు 2 నెలలు పొడిగంపు

పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వరంగ ఎయిరిండియాకు చెందిన వాటాలను విక్రయించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ వాటాల విక్రయానికి సంబంధించి బిడ్స్ వేసేందుకు విధించిన గడువును కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏర్పడిన అవాంతరాలను పరిగణలోకి తీసుకొని, ఈ గడువును పెంచినట్లు తెలిపింది.

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో అక్టోబర్ 30వ తేదీ వరకు ఈ బిడ్డింగ్ గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇలా గడువులు పొడిగించడం నాలుగోసారి. ఈ నెల 31 (ఆగస్ట్) వరకు గడువు ముగియాల్సింది. కానీ మహమ్మారి కారణంగా పొడిగించింది.

Government Extends deadline for Air India bid by two months

ఇంతకుముందు జూన్ 30, ఏప్రిల్ 30, మార్చి 17వ తేదీలకు గడువును పొడిగించారు. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఎయిరిండియా వాటా విక్రయం ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎయిరిండియా భారీ అప్పుల్లో మునిగిపోయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+