PAN-Aadhaar అనుసంధానానికి గడువు పొడిగింపు.. విఫలమైతే పరిణామాల వివరాలు..

PAN-Aadhaar: ప్రస్తుతం ప్రభుత్వం అందించే ఎలాంటి పథకాలు పొందాలన్నా దానికి ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ఫిబ్రవరి కేంద్ర బడ్జెట్లో పాన్ కార్డును అన్నిచోట్ల అంగీకరించేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఆధార్ పాన్ లింక్ చేయటాన్ని తప్పనిసరి చేసింది. దీనికోసం పలుమార్పులు గడువును సైతం పొడిగించింది.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి ఆధార్-పాన్ లింక్ చేసేందుకు గడువును పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ జూన్ 30 వరకు దేశంలోని ప్రజలకు అవకాశాన్ని కల్పించింది. ప్రజలు తప్పనిసరి ఆదాయపు పన్ను నిబంధనలను పాటించేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ గడువు మార్చి 31తో ముగుస్తుంది.

Government extended PAN Aadhaar Lining deadline till june 30, 2023 know implications if failed

ఆదాయపుపన్ను శాఖ ప్రకారం ఈ రెండింటిని గడువులోపు లింక్ చేయకపోయినట్లయితే ఆ పాన్ కార్డులు పనిచేయకుండా పోతాయి. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, బ్యాంక్ ఖాతా నిర్వహించాలన్నా ఇప్పుడు పాన్ కార్డు చాలా ముఖ్యమైనది. అందుకే దేశంలోని రాజకీయ పార్టీలు ఆధార్-పాన్ కార్డులను లింక్ చేసేందుకు ప్రజలకు మరింత గడువు అందించాలని డిమాండ్ చేయటంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

గతంలో ఈ రెండింటిని లింక్ చేసేందుకు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా అవకాశాన్ని కల్పించింది. అయితే ఏప్రిల్ 1, 2022 నుంచి ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి ప్రభుత్వం రూ.500 రుసుమును విధించింది. ఆ తర్వాత లేటు రుసుమును జూలై 1, 2022 నుంచి రూ. 1,000కి పెంచింది. గడువు లోపు రెండింటిని లింక్ చేయటంలో విఫలమైతే ఏప్రిల్ 1, 2023 నుంచి చట్టం ప్రకారం కార్డు హోల్డర్లు కొన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Government extended PAN Aadhaar Lining deadline till june 30, 2023 know implications if failed

ఒకసారి PAN కార్డు పనిచేయకుండా పోయినట్లయితే.. సంబంధిత పన్ను చెల్లింపుదారు దానిపై పన్ను వాపసు లేదా వడ్డీని క్లెయిమ్ చేయలేరు. అలాగే TDS, TCSలు వారి నుంచి ఎక్కువ శాతం వసూలు చేయబడతాయి. రూ.1,000 రుసుము చెల్లించిన తర్వాత నిర్ణీత అథారిటీకి ఆధార్‌ను తెలియజేసినప్పుడు.. 30 రోజుల్లో పాన్‌ను మళ్లీ ఆపరేట్ చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. గడువును 6 నెలలు పెంచటంతో పాటు రూ.1000 రుసుమును తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి గతవారం లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి లేఖ రాశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+