జీఎస్టీ వసూళ్ల సునామీ! ఏప్రిల్‌లో రికార్డు స్థాయి ఆదాయం.. నిండిపోయిన ప్రభుత్వ ఖజానా..

GST collections: దేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఒక పెద్ద వార్త వెలువడింది. ఏంటంటే ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు ఎన్నడూ లేని విధంగా కొత్త రికార్డు సృష్టించి, అత్యధిక స్థాయిలో రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంటే గత ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.2.10 లక్షల కోట్ల కంటే ఈ వసూళ్లు 12.6 శాతం ఎక్కువ.

government earned record-breaking revenue in April created a new history in GST collection

నిన్న గురువారం అఫీషియల్ డేటా ప్రకారం, ఏప్రిల్ 2024లో GST ఆదాయం రూ.2.10 లక్షల కోట్లుగా ఉంది, దీని బట్టి చూస్తే 1 జూలై 2017న కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రెండవ అత్యధిక వసూళ్లు. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశీయ లావాదేవీల నుండి GST వసూళ్లు 10.7 శాతం పెరిగి రూ.1.9 లక్షల కోట్లకు చేరుకుంది, దీనితో పాటు దిగుమతి చేసుకున్న వస్తువుల నుండి వచ్చే ఆదాయం 20.8 శాతం పెరిగి రూ.46,913 కోట్లకు చేరుకుంది.

రీఫండ్స్‌లో 48% పెరుగుదల: ఏప్రిల్‌లో జారీ చేసిన రీఫండ్ మొత్తం 48.3 శాతం పెరిగి రూ.27,341 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో GST వసూళ్లు 9.9 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి, ఈ మొత్తం అత్యధిక ఆర్థిక కార్యకలాపాలు ఇంకా మెరుగైన అభివృద్ధి చూపిస్తుంది. వరుసగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన రూ.1.84 లక్షల కోట్ల ఆదాయం కంటే జిఎస్‌టి వసూళ్లు 6.8 శాతం ఎక్కువగా ఉన్నాయి.

మార్చి నెలలో గ్రాస్ జీఎస్టీ ఆదాయంలో సెంట్రల్ జీఎస్టీ నుండి రూ.38,100 కోట్లు, స్టేట్ జీఎస్టీ నుండి రూ.49,900 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుండి రూ.95,900 కోట్లు, కాంపెన్సేషన్ సెస్ నుండి రూ.12,300 కోట్లు ఉన్నాయి. గత ఫిబ్రవరిలో చూస్తే సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.35,204 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.43,704 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.90,870 కోట్లు, కాంపెన్సేషన్ సెస్ రూ.13,868 కోట్లు.

జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర టాప్ : మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. మహారాష్ట్ర మార్చిలో రూ.31,534 కోట్లు చెల్లించింది, గత ఏడాది మార్చి కంటే 14 శాతం ఎక్కువ. అదే సమయంలో కర్ణాటక రూ. 13,497 కోట్లు చెల్లించింది, ఈ మొత్తం వార్షిక ప్రాతిపదికన 4 శాతం పెరుగుదల చుపిస్తుంది. ఇక గుజరాత్ రూ.12,095 కోట్లు అందించింది, మార్చి 2024 నుండి 6 శాతం పెరుగుదల. తమిళనాడు రూ.11,017 కోట్లు చెల్లించింది, ఇది కూడా 7 శాతం పెరుగుదల, ఉత్తరప్రదేశ్ రూ.9,956 కోట్లు వసూలు చేసింది, గత సంవత్సరంతో పోలిస్తే 10 శాతం పెరుగుదల.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+