ఆర్థిక మందగమనం కారణంగా గత కొంతకాలంగా రెవెన్యూ కలెక్షన్లు తగ్గిన విషయం తెలిసిందే. డిమాండ్ తగ్గి, ఉత్పత్తి పడిపోయింది. ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బ కూడా భారత ఆర్థిక వ్యవస్తపై పడుతోంది. ఈ మహమ్మారి కారణంగా ఆదాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత ప్రభుత్వం మూడు కీలక విధాన కార్యక్రమాలను పక్కన పెట్టినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మందగమనం తర్వాత.. కరోనా దెబ్బ
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఇలాంటి పరిస్థితుల్లో వెజిటేబుల్ ఆయిల్ తదితరాలపై ఇంపోర్ట్ ట్యాక్సెస్ తగ్గించడం ఇందులో ఓ కీలకమైన అంశమని అంటున్నారు. గత ఏడాది కాలంగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఇప్పుడు కరోనా దెబ్బ పడుతోంది.

ఆయిల్ ధరలు అదుపులో ఉంచేందుకు..
ఉదాహరణకు ఈ ఆర్థిక సంవత్సరంలో 11 నెలల కాలంలో ఆదాయపు పన్ను రెవెన్యూ 3.5 శాతం మేర తగ్గాయి. ఇతర ట్యాక్స్ ఆదాయాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. దాదాపు 3.8 శాతం పెరిగాయి. దేశీయంగా ధరలను అదుపులో ఉంచేందుకు పామాయిల్ సహా ముడి, శుద్ధి వెజిటబుల్ ఆయిల్ దిగుమతులపై పన్నను 3.7 శాతం తగ్గించాలని జనవరిలో ఆహార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. అయితే ఆదాయ సంక్షోభం ఎదుర్కొంటున్నందున దీనిని పక్కన పెట్టారు.

మరో రెండు..
కేవలం వెజిటబుల్ ఆయిల్స్ పైనే కాదు. ఆహార మంత్రిత్వ శాఖ చేసిన మరో కీలక ప్రతిపాదనను కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ పక్కన పెట్టింది. ఆ ప్రతిపాదన బియ్యం, గోదుమ సరఫరా పెంపు లక్ష్యం. అదే సమయంలో పేదరికంలో ఉన్న లక్షలాది మందికి విటమిన్-బలవర్ధక బియ్యం ఇవ్వాలని ఆహార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రణాళికను కూడా ఆర్థిక శాఖ పక్కన పెట్టింది. దీనికి రూ.5 ట్రిలియన్లు ఖర్చవుతుందని అంచనా.

కరోనా దెబ్బతో పలు పథకాలు, విధానాలు మందగించే ఛాన్స్
ఈ ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు కాకపోయినా మున్ముందు ప్రజలకు ఉపయోగపడేలా సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కానీ కరోనా కారణంగా ప్రస్తుతం కీలక ప్రతిపాదనలు పక్కన పెట్టింది. గతంలో మందగమనం, ఇప్పుడు కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో అనేక విధానాలు, పథకాలు మందగించే అవకాశాలున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications