బీఎస్ఎన్ఎల్ ఆస్తుల విక్రయం ప్రారంభం, రూ.37,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్), ఎంటీఎల్ఎల్ (మహానగర్ టెలిఫోన్ సంచార్ నిగమ్ లిమిటెడ్కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభమైంది. ఈ అంశానికి సంబంధించి మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందుకు డిపార్టుమెంట్ ఆప్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (DIPAM) కన్సల్టెంట్ను నియమించింది.
సీబీఆర్ఈ, జేఎల్ఎల్ నైట్ ఫ్రాంక్ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కంపెనీల ఆస్తుల విక్రయానికి సంబంధించి కన్సల్టెంట్లుగా వ్యవహరించనున్నాయి. అలాగే, కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్తుల విక్రయం లాభమా, కాదా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తాయి. ఈ నెలాఖరు నాటికి ఈ సంస్థలు తమ నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తాయి.
ఆ దేశాలకు పెను సంక్షోభం: ఫారన్ వర్కర్స్ ఉపాధిపై కరోనా ప్రభావం ఎంతలా అంటే?
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఆస్తుల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.37,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. ఈ మేరకు ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో అంచనా వేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెండు లక్షల కోట్ల రూపాయల కంటే పైగా సమీకరించాలని భావిస్తోంది.