Minimum Balance Charges: ప్రస్తుతం దేశంలో వేగంగా డిజిటలైజేషన్ జరుగుతుందని మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ వ్యవస్థను రోజువారీ చెల్లింపులకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో చేస్తున్న చిన్న పొరపాటుతో ఖాతాదారులు ఏకంగా వేల కోట్లు నష్టపోతున్నట్లు వెల్లడైంది.
గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాదారుల నుంచి ఏకంగా రూ.2,331 కోట్లను పెనాల్టీల రూపంలో సొమ్ము చేసుకున్నాయి. వాస్తవానికి లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ.. ఈ బ్యాంకులు గత మూడేళ్లలో కనీస బ్యాలెన్స్ లేని ఖాతాదారుల నుంచి రూ.5,614 కోట్లను వసూలు చేసినట్లు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరంలో 11 ప్రభుత్వ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలకు నుంచి 25 శాతం ఎక్కువ జరిమానా విధించాయి.

అయితే దీని నుంచి కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు మాత్రమే తప్పించుకున్నారు. ఎందుకంటే 2020 ఆర్థిక సంవత్సరంలోనే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు జరిమానా విధించే నిబంధనలను SBI తొలగించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ మినహా మిగిలిన 11 బ్యాంకులు ఖాతాదారుల నుంచి కనీస బ్యాలెన్స్ లేని పేరుతో భారీగా రూ.2,331 కోట్లను వసూలు చేశాయి. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన రూ.1,855.43 కోట్ల కంటే 25.63 శాతం అధికం కావటం గమనార్హం.
దీని ద్వారా గట్టిగా సొమ్ము చేసుకున్న ప్రభుత్వ బ్యాంకుల్లో తొలి స్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిలిచింది. పీఎన్బీ గరిష్ఠంగా రూ.633.4 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేసింది. ఇక రెండో స్థానంలో నిలిచిన బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.386.51 కోట్లను రికవర్ చేయగా, ఇండియన్ బ్యాంక్ రూ.369.16 కోట్ల మొత్తాన్ని రికవరీతో మూడో స్థానంలో కొనసాగింది.
బ్యాంకుల వారీగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీస బ్యాలెన్స్ లేని కారణంగా ఖాతాదారుల నుంచి వసూలు చేసిన మెుత్తం వివరాలను పరిశీలిస్తే.. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.386.51 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా* రూ.194.48 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.126.95 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.284.24 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.128.17 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.369.16 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ.4.58 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రూ.39.44 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.633.4 కోట్లు, UCO బ్యాంక్ రూ.37.49 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.126.66 కోట్లు వసూలు చేశాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications