GooglePay: గత కొంతకాలంగా పేమెంట్స్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. బ్యాంకుల వద్దకు వెళ్లే అవసరం లేకుండా అరచేతిలోనే NEFT, RTGS, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా చెల్లింపులు చేయగలుగుతున్నాం. అయితే మారుతున్న పరిస్థితులు, టెక్నాలజీలకు అనుగుణంగా పలు ఇతర వ్యవస్థలూ అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా గూగుల్ పే లో ప్రవేశపెట్టిన సౌకర్యం ఈ కోవలోకే వస్తుంది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఉపయోగించి పేమెంట్స్ చేయడానికి ఆధార్ ఆధారిత ప్రామాణీకరణను గూగుల్ పే తాజాగా ప్రవేశపెట్టింది. అంటే వినియోగదారులు ఇప్పుడు డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే గూగుల్ పే లో తమ UPI పిన్ సెటప్ చేయవచ్చు. ఆధార్ నంబర్ ద్వారా గూగుల్ పే UPIలో రిజిస్టర్ కావడానికి.. వినియోగదారులు UIDAIతో, బ్యాంకు ఖాతాతో జతకాబడిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.

డెబిట్ కార్డ్ అవసరం లేని UPI సైన్-అప్ ప్రక్రియను ప్రవేశపెట్టినట్లు గూగుల్ పే ప్రకటించింది. వినియోగదారులను ధృవీకరించడం లక్ష్యంగా కొత్త ఆధార్ ఆధారిత వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి యూజర్స్ తమ ఆధార్ నంబర్ మొదటి 6 అంకెలను అందించాలి. వీటిని ధ్రువీకరణ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా UIDAIకి పంపబడతాయి.
NPCI వెబ్సైట్లో సమాచారం ప్రకారం.. ప్రస్తుతం 22 బ్యాంకులు ఆధార్ ద్వారా వినియోగదారుల ప్రమాణీకరణకు మద్దతునిస్తున్నాయి. భవిష్యత్తులో ఇతరులు సైతం ఈ వ్యవస్థలో భాగం అవుతారని గూగుల్ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే యూజర్ల ఆధార్ నంబర్లు NPCIతో మాత్రమే షేర్ చేస్తామని, తమ వద్ద ఉంచుకోబడవని హామీ ఇచ్చింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications