గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ భారతదేశంలో భారీ విస్తరణ చేపడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ప్రణాళికాబద్ధంగా ఈ కార్యాచరణ చేపడుతున్నట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది. దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ కేంద్రంగా ఉన్న బెంగళూరులో లక్షలాది చదరపు అడుగుల కొత్త కార్యాలయ స్థలాన్ని కంపెనీ తీసుకునే అవకాశముందని ఈ నివేదిక పేర్కొంది. ఈ విస్తరణతో భారతదేశంలో గూగుల్ ఉనికి గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ నిర్ణయానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలన హయాంలో కఠినతరం చేసిన వీసా నిబంధనలు. ముఖ్యంగా H-1B వీసాలపై విధించిన కొత్త ఆంక్షలు, పెరిగిన రుసుములు అమెరికాకు విదేశీ ప్రతిభను తీసుకురావడాన్ని కంపెనీలకు మరింత ఖరీదైనదిగా మార్చాయి. కొన్ని సందర్భాల్లో ఒక్కో వీసా దరఖాస్తుకు అయ్యే మొత్తం ఖర్చు లక్ష డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో.. అనేక అమెరికన్ టెక్ దిగ్గజాలు తమ నియామక దృష్టిని అమెరికా వెలుపల దేశాలవైపు మళ్లించాయి. ముఖ్యంగా భారతదేశం ప్రతిభకు కేంద్రంగా మారడంతో, ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడం వారికి అనుకూలంగా మారింది. ఈ క్రమంలోనే, ఆల్ఫాబెట్ ఇప్పటికే బెంగళూరులోని వైట్ఫీల్డ్ టెక్ కారిడార్లో ఒక ఆఫీస్ టవర్ను లీజుకు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, అలెంబిక్ సిటీలోని మరో రెండు పెద్ద వాణిజ్య టవర్లపై కూడా ఎంపికలు (options) పొందినట్లు బ్లూమ్బెర్గ్ తెలిపింది. ఈ మూడు టవర్లు కలిపి సుమారు 2.4 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అందించనున్నాయి.
వైట్ఫీల్డ్ ప్రాంతం బెంగళూరులోని అత్యంత కీలకమైన ఐటీ బెల్ట్లలో ఒకటిగా ఉంది. నగరంలోని మొత్తం ఐటీ ఉత్పత్తిలో దాదాపు 22 శాతం వాటా ఈ ప్రాంతం నుంచే వస్తుంది. ఇది ప్రపంచ స్థాయి పరిశోధన అభివృద్ధి కేంద్రంగా కూడా ఎదిగింది. గత సంవత్సరం, గూగుల్ ఇక్కడే తన అతిపెద్ద బెంగళూరు క్యాంపస్ను ప్రారంభించింది. ఈ క్యాంపస్లో ఇండోర్ మినీ గోల్ఫ్, పికిల్బాల్ కోర్టులు, కార్డమమ్ టీ అందించే ఫలహారశాలలు వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
ఈ క్యాంపస్ ప్రారంభమైన తర్వాత.. Google బెంగళూరులో వందలాది ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది. క్లౌడ్ విభాగంలో AI ప్రాక్టీస్ డైరెక్టర్లు,చిప్ డిజైనర్లు, మెషిన్ లెర్నింగ్ నిపుణులు వంటి కీలక పాత్రలకు నియామకాలు జరుగుతున్నాయి.
బ్లూమ్బెర్గ్ కథనం ప్రకారం.. ఆల్ఫాబెట్ మూడు టవర్లన్నింటినీ పూర్తిగా వినియోగించుకుంటే.. అదనంగా 20 వేల మంది ఉద్యోగులకు స్థలం లభించే అవకాశం ఉంది. ఇది భారతదేశంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసే స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం, ఆల్ఫాబెట్ భారతదేశంలో సుమారు 14 వేల మందిని నియమించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి దాదాపు 1.9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
అయితే, ఈ నివేదికపై స్పందించిన ఆల్ఫాబెట్ ప్రతినిధి.. బెంగళూరుతో సహా అనేక భారతీయ నగరాల్లో ఇప్పటికే బలమైన ఉనికిని కలిగి ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం ఒక టవర్ను మాత్రమే లీజుకు తీసుకున్నామని, అది 6.5 లక్షల చదరపు అడుగుల స్థలం అని స్పష్టం చేశారు. మిగిలిన రెండు టవర్లపై మాత్రం కంపెనీ అధికారికంగా వ్యాఖ్యానించలేదు.
ఈ విస్తరణ కేవలం గూగుల్కే పరిమితం కాదు.కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ఆధిపత్యం కోసం ప్రపంచ టెక్ కంపెనీలు పోటీ పడుతున్న నేపథ్యంలో, భారతదేశం కీలక కేంద్రంగా మారుతోంది. OpenAI, Anthropic వంటి సంస్థలు ఇప్పటికే భారత్లో కార్యకలాపాలను ప్రారంభించాయి. నాస్కామ్ అంచనాల ప్రకారం.. 2030 నాటికి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు భారత్లో 25 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నాయని తెలుస్తోంది.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

ఉచితంగా AI కోర్సులు నేర్చుకునే అవకాశం! ఎలా రిజిస్టర్ అవ్వాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications