చైనాకు చెందిన 2,500 యూట్యూబ్ ఛానల్స్ తొలగించిన గూగుల్
వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్స్ పైన తప్పుడు సమాచారం తొలగించే ఉద్దేశ్యంలో భాగంగా చైనాతో లింక్ ఉన్న 2,500 యూట్యూబ్ ఛానల్స్ను తొలగించినట్లు సెర్చింజన్ గూగుల్ వెల్లడించింది. వీటిని ఏప్రిల్ - జూన్ మధ్య తొలగించినట్లు తెలిపింది. భారత ప్రభుత్వం గతంలో చైనాకు చెందిన కొన్ని యాప్స్ను నిషేధించింది. ఇదే దారిలో మరికొన్ని దేశాలు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాగే టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు అన్నింటిని సమీక్షిస్తుంది. ఇందులో భాగంగా వీటి తొలగింపు చోటు చేసుకుంది. అయితే కరోనా తర్వాత చైనా యాప్స్, యూట్యూబ్ లింక్స్ తొలగింపు చర్చనీయాంశంగా మారింది.

తప్పుడు సమాచారం కారణంగా వీటిని తొలగించినట్లు తెలిపింది. దీనిపై స్పందించాలని కోరగా అమెరికాలోని చైనీస్ రాయబార కార్యాలయం వెంటనే రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది. అయితే గతంలో ఇలాంటి తప్పుడు సమాచార వ్యాప్తికి సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం ఖండించింది.
గతంలో ఇతర దేశాలతో సంబంధం ఉన్న నటులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు సందేశాలు పంప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 ప్రెసిడెంట్ ఎన్నికల సమయం నుండి రాజకీయ నాయకులు, టెక్ సంస్థలకు ఈ అంశం ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో గూగుల్, ఫేస్ బుక్ వంటి సంస్థలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నాయి.