Google CEO: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల తనకు ఇష్టమైన భారతీయ ఆహారాల గురించి వెల్లడించారు. అలాగే ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తన ఆలోచనలను పంచుకున్నారు. యూట్యూబర్ వరుణ్ మయ్యతో పాడ్కాస్ట్లో ఈ విషయాలను పంచుకున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ గురించి టెక్కీల్లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ సుందర్ పిచాయ్ భారతీయ ఉద్యోగ మార్కెట్పై AI ప్రభావం గురించి మాట్లాడారు. ఇదే క్రమంలో ఇక్కడి ఇంజనీర్లకు కీలక సలహాలను అందించారు. ఈ క్రమంలో పిచాయ్ తనకు వివిధ భారతీయ నగరాల నుంచి ఇష్టమైన వంటకాల గురించి బెంగుళూరులో దోస, దిల్లీలో చోలే భటుర్, ముంబైలోని పావ్ భాజీ ఇష్టమైన వంటకాలుగా పేర్కొన్నారు. తాను ఇండియాకు వచ్చినప్పుడు ఉన్న నగరాన్ని బట్టి పైన ఆహారాలను ఇష్టంగా తినేవాడినని పేర్కొన్నారు.

ఇదే క్రమంలో ఏఐ గురించి చర్చిస్చూ పిచాయ్.. ప్రపంచ AI రంగంలో భారత పాత్రను నొక్కిచెప్పారు. బలమైన ఇంజినీరింగ్ ప్రతిభ కారణంగా AI ఆవిష్కరణలో భారతదేశానికి నాయకత్వం వహించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశం మంచి స్థానంలో ఉందని తాను భావిస్తున్నట్లు గూగుల్ సీఈవో పేర్కొన్నారు. ప్రస్తుతం సమయం భారతదేశానికి కీలకమైనదిగా పేర్కొంటూ.. భారతదేశం డెవలపర్లు, ఇంజనీరింగ్ ప్రతిభకు అసాధారణమైన పునాదన్నారు. ఈ క్రమంలో ఇండియన్ టెక్కీలు ప్రస్తుత ట్రెండ్ అర్థం చేసుకుని తదనుగుణంగా తమ అప్లికేషన్స్ నిర్మించుకోవాలని అవి ఇండియాకు, ప్రపంచానికి కీలకమన్నారు. రెండూ ఉత్తేజకరమైన అవకాశాలే అన్నారు.
గూగుల్ వంటి అగ్రశ్రేణి సాంకేతిక సంస్థల్లో చేరాలనే లక్ష్యంతో యువ భారతీయులకు గట్టి పోటీని వరుణ్ మయ్య ప్రస్తావించారు. కేవలం పైపైన పరిజ్ఞానం కంటే సాంకేతికతపై లోతైన అవగాహన అవసరమని పిచాయ్ నొక్కి చెప్పారు. అతను తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి బాలీవుడ్ చిత్రం '3 ఇడియట్స్'లోని ఒక సన్నివేశాన్ని ప్రస్తావించారు. నిజమైన విజయం విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా వస్తుంది. 3 ఇడియట్స్ చిత్రానికి తిరిగి వెళ్లాలని దాదాపుగా తహతహలాడారు. అక్కడ ఒక సన్నివేశంలో అమీర్ఖాన్ను మోటారుకు నిర్వచనాన్ని అడిగారు. అక్కడ మోటారు అంటే ఏమిటో వివరించే రెండు వెర్షన్లు ఉన్నాయి. మోటారు అంటే ఏమిటో మీరు అర్థం చేసుకునే సంస్కరణ ఉందని పిచాయ్ చెప్పారు.


Click it and Unblock the Notifications