మీరు యుపిఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా అయితే ఈ వార్త మీ కోసమే. డిజిటల్ పేమెంట్స్ మరింత సులభం ఇంకా ఉపయోగకరంగా మార్చేందుకు యుపిఐ ట్రాన్సక్షన్స్ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వ్యాపారులకు, సాధారణ కస్టమర్లకు ఇద్దరికీ కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

ఆర్బిఐ కొత్త ఆదేశం ఏంటి : బ్యాంకులతో సంప్రదించిన తర్వాత పర్సన్ టు మర్చంట్ (P2M అండ్ M2M), మర్చంట్ టు మర్చంట్ ట్రాన్సక్షన్స్ లిమిట్ పెంచడానికి లేదా తగ్గించడానికి RBI ఇప్పుడు NPCI అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అధికారం ఇచ్చింది. ఇప్పటివరకు ఈ రెండు రకాల ట్రాన్సక్షన్స్ లిమిట్ రూ.1 లక్ష ఉండేది, కానీ ఇప్పుడు దానిని రూ.2 లక్షల వరకు లేదా రూ.5 లక్షల వరకు పెంచవచ్చు.
సామాన్యులకు ఉన్న రూల్ ఏంటి : సాధారణ ప్రజలకి అంటే పర్సన్-టు-పర్సన్ (P2P) ట్రాన్సక్షన్స్ లిమిటీలో ఎటువంటి మార్పు లేదని RBI స్పష్టం చేసింది. అంటే ఇప్పుడు UPI ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకరికి గరిష్టంగా రూ.1 లక్ష వరకు పంపవచ్చు.
UPI లిమిట్ ప్రస్తుత స్టేటస్ : P2P అంటే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి 1 లక్ష, అలాగే P2M అంటే ఒక వ్యక్తి నుండి వ్యాపారికి 1 లక్ష (ప్రస్తుతం), M2M (వ్యాపారి నుండి మరొక వ్యాపారికి) రూ.1 లక్ష (ప్రస్తుతం)
బిజినెస్ క్లాస్ కు అతిపెద్ద ప్రయోజనం: ఈ మార్పు వల్ల వ్యాపారులు అతిపెద్ద ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారులు ఎటువంటి అడ్డంకులు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్సక్షన్ చేయవచ్చు. ఈ బెనిఫిట్ ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలు, జ్యువెలరీ షాపులు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్లు ఇంకా ఇతర పెద్ద వ్యాపారాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతం : ఈ చర్య భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఎక్కువ మంది క్యాష్ కంటే డిజిటల్ పేమెంట్స్ ఇష్టపడుతున్నారు, దీని వల్ల పారదర్శకత పెంచుతుంది ఇంకా పేమెంట్ సిస్టం బలోపేతం చేస్తుంది.
బ్యాంకులకు కొత్త బాధ్యత : ట్రాన్సక్షన్స్ లిమిట్ ఇప్పుడు పెరిగే ఛాన్స్ ఉండటంతో బ్యాంకులు వాటి టెక్నీకల్ సెక్యూరిటీ ఇంకా స్ట్రాంగ్ సిస్టం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది, ఎందుకంటే దీని ద్వారా మోసాలను నివారించవచ్చు.
NPCIకి కీలక బాధ్యత : ఇప్పుడు NPCI మార్కెట్ డిమాండ్ ప్రకారం ఇంకా బ్యాంకులతో చర్చించడం ద్వారా UPI ట్రాన్సక్షన్ లిమిట్ మార్చే అధికారాన్ని పొందింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications