Gold Rate: శుభవార్త.. సామాన్యులను కనికరించిన గోల్డ్.. నేడు ఏకంగా రూ.1,600 తగ్గిన ధర..

Gold Price Today: దేశీయంగా నిన్న పెరిగి షాక్ ఇచ్చిన పసిడి ధరలు నేడు తిరిగి తగ్గాయి. ఈవారం మెుదటి నుంచి పసిడి ధరలు భారీగా తగ్గుతూ భారతీయ కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో వారాంతంలో షాపింగ్ చేయాలని భావిస్తున్న వారికి ప్రస్తుతం సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ధరలు అధికంగా ఉన్న వేళ చాలా మంది తమ పాత బంగారాన్ని మార్చుకుని దానికి అదనంగా అయ్యే ఖర్చులను చెల్లించి కొత్త ఆభరణాలను తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు.

ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1,200 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7090, ముంబైలో రూ.7093, దిల్లీలో రూ7105, కలకత్తాలో రూ.7090, బెంగళూరులో రూ.7090, కేరళలో రూ.7090, పూణేలో రూ.7090, వడోదరలో రూ.7095, అహ్మదాబాదులో రూ.7095, జైపూరులో రూ.7121, లక్నోలో రూ.7121, కోయంబత్తూరులో రూ.7106, పాట్నాలో రూ.7111, మంగళూరులో రూ.7090, నాశిక్ లో రూ.7093, అయోధ్యలో రూ.7105, బళ్లారిలో రూ.7090, గురుగ్రాములో రూ.7105, నోయిడాలో రూ.7105 వద్ద కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

Good News to Indian Buyers as Gold rates started dropping again Know AP TG latest prices

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.10,900 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7735, ముంబైలో రూ.7735, దిల్లీలో రూ.7750, కలకత్తాలో రూ.7735, బెంగళూరులో రూ.7735, కేరళలో రూ.7735, పూణేలో రూ.7735, వడోదరలో రూ.7740, అహ్మదాబాదులో రూ.7740, జైపూరులో రూ.7767, లక్నోలో రూ.7767, కోయంబత్తూరులో రూ.7752, పాట్నాలో రూ.7757, మంగళూరులో రూ.7735, నాశిక్ లో రూ.7738, అయోధ్యలో రూ.7750, బళ్లారిలో రూ.7735, గురుగ్రాములో రూ.7750, నోయిడాలో రూ.7750గా విక్రయాలు జరుగుతున్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7090గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7735 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7090గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7735 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.98,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+