Gold Rate: శుభవార్త.. బుధవారం కుప్పకూలిన గోల్డ్ రేట్లు.. రూ.1600 తగ్గిన ధర, ఏపీ-తెలంగాణలో..

Gold Price Today: గడచిన వారం నుంచి పెరుగుతూ గడగడలాడిస్తున్న పసిడి ధరలు ప్రస్తుతం తిరిగి క్షీణతను ప్రారంభించాయి. దీంతో మరో వారంలో క్రిస్మస్ పండుగ వస్తున్న వేళ చాలా మంది తమ షాపింగ్ చేయాలని వేచిచూస్తున్న సమయంలో ధరల పతనం కొత్త కొనుగోళ్లకు ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో నేడు ఆలస్యం చేకుండా షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా ముందు రేట్లను గమనించాటం ముఖ్యం.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1500 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7135, ముంబైలో రూ.7135, దిల్లీలో రూ.7150, కలకత్తాలో రూ.7135, బెంగళూరులో రూ.7135, కేరళలో రూ.7135, వడోదరలో రూ.7140, అహ్మదాబాదులో రూ.7140, జైపూరులో రూ.7150, లక్నోలో రూ.7150, మంగళూరులో రూ.7135, నాశిక్ లో రూ.7138, మైసూరులో రూ.7135, అయోధ్యలో రూ.7150, బళ్లారిలో రూ.7135, గురుగ్రాములో రూ.7150, నోయిడాలో రూ.7150గా కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

Good news to gold buyers as prices dropped today Know latest Rates in AP TG

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1,600 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన పసిడి విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7784, ముంబైలో రూ.7784, దిల్లీలో రూ.7799, కలకత్తాలో రూ.7784, బెంగళూరులో రూ.7784, కేరళలో రూ.7784, వడోదరలో రూ.7789, అహ్మదాబాదులో రూ.7789, జైపూరులో రూ.7799, లక్నోలో రూ.7799, మంగళూరులో రూ.7784, నాశిక్ లో రూ.7787, మైసూరులో రూ.7784, అయోధ్యలో రూ.7799, బళ్లారిలో రూ.7784, గురుగ్రాములో రూ.7799, నోయిడాలో రూ.7799గా నేడు విక్రయాలు జరుగుతున్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7135గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7784 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7135గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7784 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,00,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+