Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త.. శనివారం గోల్డ్ రేట్ల భారీ పతనం, రూ.10,900 తగ్గిన రేటు..

Gold Price Today: చాలా కాలంగా పసిడి ధరలు సామాన్య భారతీయ కుటుంబాల్లో పసిడికి విలువ ఎక్కువ. అందుకే చిన్న ఫంక్షన్ల నుంచి పెద్ద శుభకార్యాల వరకు గోల్డ్ కొనుగోలు చేస్తున్నాయి. వాస్తవానికి ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై వరుసగా టారిఫ్స్ విధించటంతో పసిడికి సెంట్రల్ బ్యాంకులతో పాటు రిటైల్ మార్కెట్లో కూడా డిమాండ్ పెరిగింది.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.10,000 భారీ పతనాన్ని చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7890, ముంబైలో రూ.7890, దిల్లీలో రూ.7905, కలకత్తాలో రరూ.7890, బెంగళూరులో రూ.7890, కేరళలో రూ.7890, వడోదరలో రూ.7895, జైపూరులో రూ.7905, లక్నోలో రూ.7905, మంగళూరులో రూ.7890, నాశిక్ లో రూ.7893, అయోధ్యలో రూ.7905, బళ్లారిలో రూ.7890, గురుగ్రాములో రూ.7905, నోయిడాలో రూ.7905గా నేడు కొనసాగుతున్నాయి.

Good news to Gold Buyers as prices dropped drastically on weekend sparking buying spree

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చినప్పుడు 100 గ్రాముల పసిడి ధర రూ.10,900 మేర భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8607, ముంబైలో రూ.8607, దిల్లీలో రూ.8622, కలకత్తాలో రూ.8607, బెంగళూరులో రూ.8607, కేరళలో రూ.8607, వడోదరలో రూ.8612, జైపూరులో రూ.8622, లక్నోలో రూ.8622, మంగళూరులో రూ.8607, నాశిక్ లో రూ.8610, అయోధ్యలో రూ.8622, బళ్లారిలో రూ.8607, గురుగ్రాములో రూ.8622, నోయిడాలో రూ.8622 వద్ద ఉన్నాయి.

గోల్డ్ రేట్ల ర్యాలీ..
ప్రస్తుతం పెరుగుతున్న పసిడి ధరలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా తాజా ట్రేడ్ టారిఫ్స్ కారణంగా ముందస్తు వ్యూహాత్మక రక్షణ చర్యల్లో భాగంగా చైనా నుంచి పసిడి డిమాండ్ పెరగటంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. ప్రస్తుతం చైనా-యూఎస్ ట్రేడ్ వార్ కారణంగా అప్రమత్తమైన ప్రపంచ దేశాల నుంచి కూడా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. ఈ కారణాలతో గోల్డ్ రేట్లు సామాన్యులకు అందనంత స్థాయిలకు పెరిగిపోయాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7890గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8607 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7890గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8607 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,08,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+