Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త.. శుక్రవారం కుప్పకూలిన గోల్డ్.. రూ.5,400 తగ్గిన ధర

Gold Price Today: గడచిన రెండు రోజులుగా పసిడి ధరలు భారీగా క్షీణించటం భారతీయ కొనుగోలుదారుల్లో సంతోషాన్ని నింపుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలతో గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితులు తగ్గుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వారాంతంలో పెళ్లిళ్ల కోసం ఆభరణాల షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5,000 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7960, ముంబైలో రూ.7960, దిల్లీలో రూ.7975, కలకత్తాలో రూ.7960, బెంగళూరులో రూ.7960, కేరళలో రూ.7960, పూణేలో రూ.7960, వడోదరలో రూ.7965, అహ్మదాబాదులో రూ.7965, జైపూరులో రూ.7975, లక్నోలో రూ.7975, కోయంబత్తూరులో రూ.7960, మంగళూరులో రూ.7960, నాశిక్ లో రూ.7963, అయోధ్యలో రూ.7975, బళ్లారిలో రూ.7960, గురుగ్రాములో రూ.7975, నోయిడాలో రూ.7975 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

Good news to gold and silver lovers as prices dropped drastically amid wedding season

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5,400 తగ్గుదలను చూసింది. దీంతో పెళ్లిళ్ల సీజన్ సమయంలో షాపింగ్ చేయాలనుంకుంటున్న వారి కోసం వివిధ నగరాల్లోని నేటి రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.8684, ముంబైలో రూ.8684, దిల్లీలో రూ.8699, కలకత్తాలో రూ.8684, బెంగళూరులో రూ.8684, కేరళలో రూ.8684, పూణేలో రూ.8684, వడోదరలో రూ.8689, అహ్మదాబాదులో రూ.8689, జైపూరులో రూ.8699, లక్నోలో రూ.8699, కోయంబత్తూరులో రూ.8684, మంగళూరులో రూ.8684, నాశిక్ లో రూ.8687, అయోధ్యలో రూ.8699, బళ్లారిలో రూ.8684, గురుగ్రాములో రూ.8699, నోయిడాలో రూ.8699గా కొనసాగుతున్నాయి.

మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. నిపుణుల అంచనాల ప్రకారం పసిడి ధర ఔన్సుకు 3000 డాలర్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా గోల్డ్ భారీగా ధర పెరుగుతూ భవిష్యత్తు ధరలపై క్లారిటీ వస్తోంది.

తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7960గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8684 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,000 తగ్గి రూ.1,05,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+